AnushkaSharma: కష్టకాలంలో పేదలకు అండగా ఉందాం

బాలీవుడ్‌ నటి, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన అభిమానులకు ఒక వీడియో సందేశం పంపింది. మే 1తో అనుష్క 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. కాగా.. పుట్టినరోజు వేడుకలు నిర్వహించకపోవడానికి గల కారణాలు కూడా ఆమె ఆ వీడియోలో వెల్లడించింది.

Published : 03 May 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ మే 1న 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. కాగా.. పుట్టినరోజు వేడుకలు నిర్వహించకపోవడానికి గల కారణాలను ఆమె ఓ వీడియోలో వెల్లడించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. అందుకోసం అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చింది.

‘నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మన చుట్టూ విపత్కర పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో జన్మదిన వేడుకలు చేసుకోవడం సరైంది కాదనిపించింది. మీరంతా సురక్షితంగా ఉండండి. నా భర్త విరాట్‌ కోహ్లీతో కలిసి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కష్టకాలంలో దేశంలోని పేదలను ఆదుకోవడమే ఆ కార్యక్రమ ఉద్దేశం. అందుకు మీరూ కలిసి రావాలని కోరుతున్నా. అందరం కలిసి పోరాడుదాం’ అని అనుష్క పిలుపునిచ్చింది. విరాట్‌ కోహ్లీ కూడా ఈ ఏడాది కరోనాను దృష్టిలో పెట్టుకొని తన భార్య అనుష్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని