Atlee: అట్లీ లైనప్‌లో మాములుగా లేదుగా.. లిస్ట్‌లో మరో స్టార్‌ హీరో

స్టార్ డైరెక్టర్‌ అట్లీ (Atlee) తీయనున్న చిత్రాలపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇటీవలే ఓ భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించిన ఆయన.. తాజాగా తన లిస్ట్‌లో మరో స్టార్ హీరో ఉన్నట్లు చెప్పారు.

Published : 16 Nov 2023 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు అట్లీ ‘జవాన్‌’తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ యంగ్‌ దర్శకుడి తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే తాజాగా అట్లీ కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. తన అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్స్‌ గురించి చెప్పారు. ఇప్పటికే షారుక్‌-విజయ్‌లతో సినిమా తీయనున్నట్లు చెప్పిన ఈ టాలెంటెడ్‌ దర్శకుడు (Atlee) ఇప్పుడు మరో స్టార్‌ హీరోతో కూడా సినిమా తీయడానికి స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌(Ajith) అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన అట్లీ.. త్వరలోనే ఆయనతో సినిమా తీసే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ‘అజిత్‌కు సరిపోయే స్క్రిప్ట్‌ నా దగ్గర ఉంది. దానిపై పూర్తిగా వర్క్‌ చేయాలి. ఆ స్టోరీ గురించి అజిత్‌కు చెప్పాలని ప్రయత్నించా. కానీ కుదరలేదు. ఒకవేళ ఆయన అంగీకరించి సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే.. అది సూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది. ఆయన  రమ్మని పిలవగానే వెళ్లి కథ గురించి చెబుతాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అజిత్‌ నాకు ఫోన్‌ చేసి ఓదార్చారు. ఆయన చాలా మంచి మనిషి’ అని చెప్పారు. దీంతో అట్లీ తీయనున్న సినిమాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

యశ్‌తో నటించాలని ఉంది: కరీనా కపూర్‌

తాజాగానే అట్లీ భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. షారుక్- విజయ్‌లతో ఓ సినిమా తీయనున్నట్లు చెప్పారు. ఆ సినిమా కచ్చితంగా రూ.3000కోట్లు వసూళ్లు చేస్తుందన్నారు. ఇక ఈ సినిమాను కమల్‌ హాసన్ నిర్మించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక వీటితో పాటు అల్లు అర్జున్‌తో కూడా అట్లీ ఓ సినిమా తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూసి అట్లీ లైనప్‌ పెద్దదే అంటున్నారు అభిమానులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని