సిక్కింలో ‘బిల్లా రంగా’

టాలీవుడ్‌ నటులు చిరంజీవి, మోహన్‌బాబు మంచి మిత్రులని అందరికీ తెలిసిన విషయమే. వృత్తి, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న వీరిద్దరూ చాలాకాలం తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని వీకెండ్‌...

Published : 15 Mar 2021 15:01 IST

వైరల్‌గా మారిన చిరు-మోహన్‌బాబు పిక్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటులు చిరంజీవి, మోహన్‌బాబు మంచి మిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. వృత్తి, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న వీరిద్దరూ చాలాకాలం తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని వీకెండ్‌ ఎంజాయ్‌ చేయడానికి సిక్కిం వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు లక్ష్మి ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేసింది. ‘ఇద్దరు మ్యాస్ట్రోలు కలిసి సిక్కిం ట్రిప్‌కు వెళ్తే.. ఆ ప్రయాణం సూపర్‌గా ఉంటుంది. వీకెండ్‌ టూర్‌ కోసం సిక్కిం వెళ్లడానికి చిరు అంకుల్‌ నాన్నని ఒప్పించగలిగారు. నాకెంతో అసూయగా ఉంది(సరదాగా)! వారాంతంలో మీ ఇద్దరూ ఇలా కొంతసమయాన్ని గడపడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా హృదయం నిండింది. ఏదో ఒకరోజు పిల్లలందరం మీతో కలిసి వస్తాం’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘సిక్కింలో బిల్లా రంగా!! మీలో ఎంతమంది ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు?! చిరు అంకుల్‌ నాన్న కలిసి సరదాగా సమయాన్ని గడపడం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది’’ అని మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. చిరు-మోహన్‌బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘కిరాయి రౌడీలు’ వంటి చిత్రాలు అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మరోవైపు ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ పనుల్లో, మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ షూట్‌లో బిజీగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని