chiranjeevi: ప్రకటనల్లోనూ రీఎంట్రీ ఇవ్వనున్న చిరు?!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ తర్వాత సినిమాలకు విరామం ప్రకటించిన చిరు.. దాదాపు పదేళ్ల తర్వాత ‘ఖైదీ నం. 150’తో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’,

Published : 09 Feb 2022 11:42 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ తర్వాత సినిమాలకు విరామం ప్రకటించిన చిరు.. దాదాపు పదేళ్ల తర్వాత ‘ఖైదీ నం. 150’తో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’తోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. కాగా.. ఆయన ఇప్పుడు ప్రకటనల్లోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

తాజాగా ఓ ప్రముఖ రియల్‌-ఎస్టేట్‌ సంస్థ చిరును తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని కోరడంతో ఆయన ఒప్పుకున్నారట. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని, ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. రియల్‌-ఎస్టేట్‌ సంస్థ పనితీరు నచ్చడంతోనే చిరు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండేందుకు ఓకే చెప్పారట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. గతంలో చిరు ‘థంబ్స్‌అప్‌’, ‘నవరత్న ఆయిల్‌’ బ్రాండ్స్‌ ప్రకటనల్లో కనిపించారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ప్రకటనలో నటించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి తనయుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ రియల్‌-ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ తండ్రికుమారులిద్దరూ సినిమాలతోపాటు ప్రకటనల్లోనూ పోటీ పడబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని