MAA Election: మీకు మీరే.. ‘మా’కు మేమే!
తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో నలుగురు నటీనటులు పోటీ చేస్తుండగా... తాజాగా సీనియర్ నటులు సీవీఎల్ కూడా అధ్యక్ష పోటీకి సిద్ధమయ్యారు.
తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో నలుగురు నటీనటులు పోటీ చేస్తుండగా... తాజాగా సీనియర్ నటులు సీవీఎల్ కూడా అధ్యక్ష పోటీకి సిద్ధమయ్యారు. ఈ పోటీలో నిలబడటంపై అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు బహిరంగ లేఖ రాశారు. సినీ పరిశ్రమ కష్టాలు తెలిసినవాడిగా సేవ చేసేందుకు కర్తవ్యంగా భావిస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. ప్యానల్స్ను రద్దు చేసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని పలువురు మాజీసభ్యులు సినీ పెద్దలను కోరుతున్నారు.
మరోసారి సాధారణ ఎన్నికలను తలపించేలా తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్లో జరిగే మా ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్థుల హడావుడి మొదలైంది. ఈ రేసులో ఇప్పటికే నలుగురు పోటీ చేస్తుండగా మరో సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో మా ఎన్నికల బరిలో అధ్యక్ష పోటీకి దిగిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎన్నికల సమయానికి మరికొంత మంది నటీనటులు కూడా స్వతంత్రులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు... మా సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పోటీకి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. మా ఇంటిని మనమే చక్కదిద్దుకుందామంటూ పిలుపునిచ్చారు. గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసిన తండ్రి మోహన్ బాబు మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు విష్ణు స్పష్టం చేశారు. తమ కుటుంబం సినీ పరిశ్రమకు ఎంతో రుణపడి ఉందని పేర్కొన్న విష్ణు... ఆ రుణాన్ని తీర్చుకోడానికి సేవ చేయడమే కర్తవ్యంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు సినిమాతో పెరిగిన తాను... పరిశ్రమలోని కష్టాలు, సుఖాలు తెలుసని, అలాగే అసోసియేషన్ కుటుంబసభ్యుల భావాలు, బాధలు తెలుసని విష్ణు తన లేఖలో వివరించారు. మా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన సమయంలోనే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే వ్యయంలో 25 శాతం అందిస్తానని గతంలోనే హామీ ఇచ్చానని పేర్కొన్న విష్ణు... పలు కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. పెద్దల అనుభవాలు, యువ కథానాయకుల ఆలోచనలతో నడవాలనేదే తన ప్రయత్నంగా భావిస్తున్నట్లు విష్ణు తన లేఖలో స్పష్టం చేశారు.
పారదర్శకత లేని ఎన్నికల వల్ల తెలుగు నటీనటులకు అన్యాయం జరుగుతోందని సీనియర్ నటుడు సీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదంతో ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యవర్గంలో సగం మంది తెలంగాణ కళాకారులకు చోటు కల్పించాలని సీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేస్తున్నారు.
‘‘రాబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నేనూ పోటీ చేస్తున్నా. నా ప్యానెల్ తెలంగాణ వాదం.. తెలంగాణ కళాకారుల ఇబ్బందులు.. చిన్న, పేద, మధ్య తరగతి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయంపై కూడా పోరాడతాం. గతంలో పరభాషా నటుల గురించి ఒక నియమం తీసుకొచ్చారు. హీరోయిన్ కాకుండా గరిష్ఠంగా ఇద్దరు పరభాషా నటులను తీసుకోవాలని అందులో ఉంది. ఇప్పుడు ఆ నియమాన్ని తుంగలో తొక్కి జరుగుతున్న కార్యక్రమాల కారణంగా చాలా మంది తెలుగు కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ‘మా’కు సంబంధించినంత వరకూ రెండు విభాగాలు చేయమని కోరుతున్నా’’ అని సీవీఎల్ నర్సింహారావు చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఎన్నికలపై పలువురు మాజీ కార్యవర్గ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా మా ఎన్నికల విధానం సరిగా జరగడం లేదని నటుడు కాదంబరి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పెద్దలు జోక్యం చేసుకొని ప్రస్తుతం ప్రకటించిన ప్యానల్స్ ను రద్దు చేసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరారు.
‘‘ఒక వ్యవస్థలో నాయకుడిగా వచ్చినప్పుడు మీ ఆలోచనలు దాన్ని బాగా నడపడానికి పెట్టండి. కానీ, వెలుతురులో నుంచి సూర్య కిరణాల్లా వస్తున్న మనుషుల్ని, వాళ్ల ఆసక్తులను చంపటానికి ప్రయత్నించవద్దని పెద్దలను ప్రాధేయపడుతున్నా. కమిటీలోని పెద్దలందరూ కూర్చొని దాన్ని ముందుకు నడపండి. ఏకగ్రీవం చేయించండి’’ అని సినీ నటుడు కాదంబరి కిరణ్ కోరుతున్నారు.
ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించి ఎన్నికల కార్యచరణ సిద్ధం చేసుకుంటుండగా... మంచు విష్ణు యువ కథానాయకులతో కలిసి రంగంలోకి దిగేందుకు ప్యానల్ ను సిద్ధం చేస్తున్నారు. మహిళకు అవకాశం కల్పించాలనే డిమాండ్ తో జీవితరాజశేఖర్ ఒంటరిగానే అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హేమ కూడా జీవిత బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ప్రసక్తే లేదని పోటీలో ఉన్న అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మూడు నెలల ముందే సినీపరిశ్రమలో మా ఎన్నికలపై వివాదాలు ముదురుతున్నా సినీపెద్దలు ఎందుకు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్