Devi Sri Prasad: ఆ లెక్కలకి అతీతమైనదే సంగీతం
ఉ అంటావా ఉఊ అంటావా... అంటూ దేశం మొత్తం ఊగిపోయేలా చేశాడు
ఉ అంటావా ఉఊ అంటావా... అంటూ దేశం మొత్తం ఊగిపోయేలా చేశాడు.. దేవిశ్రీప్రసాద్. ఆయన బాణీల్లో హుషారు అలాంటిది. ఇటీవల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేశారు. శర్వానంద్ కథానాయకుడిగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’... అలా మిమ్మల్ని చెప్పమంటే ఎవరితో మొదలుపెడతారు?
ప్రపంచంలో ఎవరైనా మొదట అమ్మకే జోహార్లు చెబుతారు. మా అమ్మ గురించి అందరికీ తెలిసిందే. మా నాన్న, మేము కెరీర్లో విజయవంతం అయ్యామన్నా, మేమంతా సంతోషంగా ఉన్నామన్నా కారణం మా అమ్మే. మా నాన్నకి 32ఏళ్ల వయసులోనే గుండెపోటు వచ్చింది. అప్పట్నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.
ఈ కథ విన్నప్పుడు మీ వ్యక్తిగత జీవితం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా?
ఈ సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు తిరుమల కిషోర్కి కొన్ని ఫొటోలు పంపించా. నా జీవితం మన సినిమాలాగే ఉంటుందని చెప్పేవాణ్ని. మా ఊరు వెళ్లినప్పుడు పిన్ని, బాబాయ్లు, అత్తయ్యలు, మావయ్యలు, అక్కవాళ్లూ, వాళ్ల పిల్లలు, కజిన్స్... ఇలా అందరూ చుట్టుముట్టేవారు. వాళ్లందరికీ నేనంటే చాలా ఇష్టం, బాగా ముద్దు చేసేవాళ్లు. ఈ సినిమా అలాగే ఉంటుంది. ఇంత మంది కుటుంబ సభ్యుల మధ్య ఓ కుర్రాడి జీవితం ఎలా సాగిందనేది చాలా బాగుంటుంది.
దర్శకుడు తిరుమల కిషోర్తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. పని విషయంలో ఆయనతో మీకున్న సౌలభ్యం ఎలాంటిది?
కథ విషయంలో తిరుమల కిషోర్ చాలా స్పష్టతతో ఉంటాడు. సృజనాత్మకత ఉన్న దర్శకుడు. తను ఎక్కడ పాట కావాలనేది చాలా బాగా చెబుతుంటారు. నేను రాసిన ‘మాంగళ్యం తంతునానేనా...’ నేపథ్యం చెప్పినప్పుడు వెంటనే నాకు ట్యూన్ వచ్చేసింది. టైటిల్ గీతం అనుకున్నప్పుడు దానికి ఫన్ జోడిస్తే బాగుంటుందనుకున్నాం, అదే చేశాం. ఆయన కెరీర్లోనే అత్యుత్తమమైన సినిమాగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నిలుస్తుందని కచ్చితంగా చెబుతా. మిక్సింగ్ సమయంలోనే ఈ సినిమాని మూడుసార్లు చూశా. అంత బాగా నచ్చింది. ‘పుష్ప’ ప్రచారం సమయంలోనే సుకుమార్కి ఇందులోని ఓ పాట వినిపించా. సూపర్ డార్లింగ్... అని అప్పుడే చెప్పేశారు. టైటిల్ గీతం వచ్చాకైతే అనిల్ రావిపూడి, బాబీ, ప్రభుదేవా... ఇలా చాలా మంది మెచ్చుకున్నారు.
‘పుష్ప’ సంగీతం సరిహద్దులు దాటి విశేష ప్రాచుర్యం పొందింది. దానివెనక కారణాల గురించి చెప్పమంటే?
సుకుమార్ సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయి. తనకి ఎప్పట్నుంచో ఆ విషయం చెబుతూ నీ సినిమాలు అన్ని భాషల్లోనూ రావాలనేవాణ్ని. అల్లు అర్జున్ని పాన్ ఇండియాని వదలకు, తమిళంలోనూ చేయమని చెప్పేవాణ్ని. అలాంటి అవకాశం మా అందరికీ ఈ సినిమాతో కుదిరింది. ఐదు భాషల్లో ఈ పాటలు రావడం, ముఖ్యంగా నాకు హిందీ, తమిళం, తెలుగు భాషలు బాగా వస్తాయి కాబట్టి పాటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నా. అందుకే ఆయా భాషల్లో ఎక్కడా ఇవి డబ్బింగ్ పాటలు అన్నట్టు ఉండవు. ‘పుష్ప’ చేస్తున్నప్పుడే ‘పుష్ప2’ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. ఆ పనులూ మొదలయ్యాయి.
ఇప్పుడు సంగీతం వేగంగా చేరువవుతోంది. సామాజిక మాధ్యమాలు ప్రభావం చూపిస్తున్నాయి. సంగీతానికి ఇది మంచి సమయమే కదా?
సంగీతానిది ఎప్పుడూ గోల్డెన్ ఎరానే. వందేళ్లు, యాభయ్యేళ్ల కిందట పాటల్ని మనం పాడుకుంటున్నాం కదా. మరి అప్పట్లో ఏ సామాజిక మాధ్యమాలు ఉండేవి? సంగీతం సామాజిక మాధ్యమాల్ని ప్రభావితం చేస్తుందేమో కానీ, దాని వల్ల సంగీతమమేమీ ప్రభావితం కాదు. ఒక పాటకి లక్షలు, మిలియన్ల వ్యూలు వచ్చాయంటే అదేం నాకు గొప్పగా అనిపించదు. ఆ లెక్కలకి అతీతమైనది సంగీతం. ఎప్పుడూ అలా ఎల్లలు దాటి వెళుతూనే ఉంటుంది.
కొత్త సినిమాల కబుర్లు?
‘ఎఫ్3’తోపాటు, బాబీ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి సినిమా కోసం మూడు పాటలు చేశాం. పవన్కల్యాణ్ - హరీష్శంకర్ కలయికలో ‘భవదీయుడు భగత్సింగ్’ చేస్తున్నా. ఓ బాలీవుడ్ చిత్రం, వైష్ణవ్తేజ్తో ‘రంగ రంగ వైభవంగా...’ చేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే..
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!