Cyber Crime: మహేశ్‌బాబు తనయ సితార పేరుతో ఇన్వెస్ట్‌మెంట్‌ లింకులు.. స్పందించిన జీఎంబీ

మహేశ్‌బాబు కూతురు సితార పేరుతో కొందరు నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్లు జీఎంబీ సంస్థ గుర్తించింది. 

Published : 10 Feb 2024 07:10 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మహేశ్‌బాబు కుమార్తె పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులు పలువురికి పంపుతున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ గుర్తించింది. ఇటువంటి వాటిని నమ్మొద్దని ఆ సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించి మాదాపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీల పేరుతో ఇలాంటి లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని