Faria Abdullah: అందుకే ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగను: ఫరియా అబ్దుల్లా

‘జాతిరత్నాలు’తో హీరోయిన్‌గా సూపర్‌సక్సెస్‌ సొంతం చేసుకున్నారు నటి ఫరియా అబ్దుల్లా. ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టీగా ఆమె నటన ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది....

Published : 28 Jan 2022 01:41 IST

హైదరాబాద్‌: ‘జాతిరత్నాలు’తో హీరోయిన్‌గా సూపర్‌సక్సెస్‌ సొంతం చేసుకున్నారు నటి ఫరియా అబ్దుల్లా. ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టీగా ఆమె నటన ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. అలా, ఆమె మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అభిమానులు ఫరియాతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ ఆమె మాత్రం అందుకు ముందుకు రావడం లేదు. ఫ్యాన్స్‌తో ఫొటోలకు నో అనే చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే తప్పక అయిష్టంతోనే ఫొటోలకు పోజులిస్తున్నారు.

ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఫరియా బయటపెట్టారు. ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘మేడమ్‌.. అభిమానులతో కలిసి ఫొటోలు దిగేందుకు మీరెందుకు ఆసక్తి కనబర్చరు..?’ అని నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘‘మీ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో మీరు నన్ను మాత్రమే కలుస్తారు. కానీ, నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నేను వంద మంది అభిమానులను కలుస్తాను. వాళ్లందరితో ఫొటోలకు పోజులిచ్చే ఎనర్జీ నాకు ఉంటుందని మీరు భావిస్తున్నారా? అదీ కాక ఫొటోలు దిగడం నాకు అంతగా ఆసక్తి ఉండదు’’ అని ఆమె సమాధానమిచ్చారు. అనంతరం మరో అభిమాని.. ‘‘ఫ్యాన్‌ మీట్‌ పెట్టాలనుకుంటున్నారా?’’ అని అడగ్గా.. ‘‘అవును కలవాలనుకుంటున్నా. ఆన్‌లైన్‌ ఫ్యాన్‌మీట్‌కు సన్నాహాలు చేద్దాం. మీరేమంటారు? ఒకవేళ కొవిడ్‌ పరిస్థితులు కాస్త మెరుగుపడితే.. తప్పకుండా అందరం బయట కలుద్దాం’’ అని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని