Tollywood: ఈ డైరెక్టర్లు గ్యాప్ ఇచ్చినా.. హిట్ కొట్టారు!
సినిమాల్లో జయాపజయాలు సహజం. తమ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మరో మంచి సినిమా తీసేందుకు దర్శకులు తహతహలాడుతారు. అయితే, కొందరు దర్శకులకు మాత్రం గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మరో సినిమా చేయడానికి చాలా కాలమే పట్టింది. కాగా..
సినిమాల్లో జయాపజయాలు సహజం. తమ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మరో మంచి సినిమా తీసేందుకు దర్శకులు తహతహలాడుతారు. అయితే, కొందరు దర్శకులకు మాత్రం గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మరో సినిమా చేయడానికి చాలా కాలమే పట్టింది. కాగా.. వారంతా ఈ ఏడాదిలోనే సినిమాలు విడుదల చేసి హిట్ కొట్టడం విశేషం. మరి ఆ దర్శకులు ఎవరో చూద్దామా..
బొమ్మరిల్లు భాస్కర్
తన తొలి సినిమా టైటిల్నే పేరులో చేర్చుకున్న దర్శకుడు.. బొమ్మరిల్లు భాస్కర్. ఐదేళ్ల తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో హిట్ సాధించాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. భాస్కర్ తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’ 2006లో విడుదలై బ్లాక్బాస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ‘పరుగు’, ‘ఆరెంజ్’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలు తెరకెక్కించగా.. అవి మ్యూజిక్ పరంగా మెప్పించినా.. సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో దర్శకుడికి అవకాశాలూ రాలేదు. చివరగా 2016లో తమిళ్లో బెంగళూరు ‘నాట్కాల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
శ్రీకాంత్ అడ్డాల
2008లో ‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా పరిచమైన శ్రీకాంత్ అడ్డాలకి.. సకుటుంబంగా చూసే సినిమాలు తీస్తాడన్న పేరుంది. ఆయన తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు అలాంటివే మరి. 2016లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల.. ఈసారి తన శైలికి భిన్నంగా తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’గా వెంకటేశ్తో రీమేక్ చేశారు. ఆ చిత్రం గత జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడులైంది. సినిమాలో వెంకటేశ్ నటనకు ప్రశంసలు లభించాయి.
గోపిచంద్ మలినేని
మాస్.. యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో గోపిచంద్ మలినేని దిట్ట. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘క్రాక్’ చిత్రం మరోసారి నిరూపించింది. 2010లో ‘డాన్ శీను’ చిత్రంతో దర్శకుడిగా మారిన గోపీచంద్.. ‘బాడీగార్డ్’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’ చివరిగా 2017లో ‘విన్నర్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఈ ఏడాదే రవితేజతో ‘క్రాక్’ చిత్రం తీసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.
సంపత్ నంది
తన రెండో ప్రయత్నంలోనే రామ్చరణ్తో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేశాడు దర్శకుడు సంపత్ నంది. 2010లో ‘ఏమైంది ఈ వేళ’ చిత్రాన్ని తెరకెక్కించిన సంపత్.. 2012లో రామ్ చరణ్ ‘రచ్చ’కు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 2015లో ‘బెంగాల్ టైగర్’, 2017లో ‘గౌతమ్ నంద’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నాలుగేళ్ల తర్వాత మరోసారి హీరో గోపీచంద్ కాంబినేషన్లో ‘సీటిమార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ డ్రామా జానర్లో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.
అనుదీప్ కేవీ
కరోనా, లాక్డౌన్తో మానసికంగా కుంగిపోయిన ప్రేక్షకులను ‘జాతిరత్నాలు’ చిత్రం కడుపుబ్బా నవ్వించింది. మార్చిలో విడుదలైన ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. 2016లో ‘పిట్టగోడ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న బడ్జెట్గా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నే అందుకుంది. మళ్లీ ఐదేళ్ల తర్వాత అనుదీప్ ‘జాతి రత్నాలు’ సినిమాతో హిట్ అందుకున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు