Tollywood: ‘హైవే’.. ప్రయోగాత్మక చిత్రం
ఆనంద్ దేవరకొండ, మానస జంటగా నటించిన చిత్రం ‘హైవే’. కె.వి.గుహన్ తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 19న ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), మానస (Manasa) జంటగా నటించిన చిత్రం ‘హైవే’ (High way). కె.వి.గుహన్ తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 19న ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో హీరో నాగశౌర్య చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చూస్తుంటే ఒక ‘ఆవారా’, ఓ ‘రాక్షసన్’ చిత్రం చూసినట్లుంది. ఈ చిత్ర టైటిల్ వినగానే చాలా పాజిటివ్గా వినిపించింది. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్కు థ్యాంక్స్. నాకు ప్రేక్షకులు లవర్ బాయ్ అని ట్యాగ్ తగిలించారు. ఆనంద్ మాత్రం ఒక్కో చిత్రం ఒక్కో జానర్లో చేస్తూ వైవిధ్యభరితంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రం కోసం కొవిడ్ టైమ్లో చాలా కష్టపడ్డాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ.. అతి తక్కువ మందితో షూట్ చేసి, అద్భుతమైన ఔట్పుట్ తీసుకొచ్చాం’’ అన్నారు హీరో ఆనంద్ దేవరకొండ. దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ.. ‘‘ఓటీటీల వల్ల కొత్త జానర్లు ప్రయత్నించే అవకాశం వచ్చింది. ఈ కథ చెప్పగానే ఆనంద్ ఓకే చెప్పారు. ఇది రెగ్యులర్ హీరోయిక్ సినిమాల్లా ఉండదు’’ అన్నారు. కార్యక్రమంలో శరత్ మరార్, కార్తీక్, మానస తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ.. దేశభక్తి
యం.డి.నజీరుద్దీన్, సీతా మహాలక్ష్మీ జంటగా డి.యస్.రాథోడ్ తెరకెక్కించిన చిత్రం ‘భారత్ కీ నారీ’ (Bharat Ki Nari). యం.డి.నమీరుద్దీన్ అహ్మద్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ను మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో సైనికులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో.. అదే విధంగా వారి సతీమణులు ఒంటరిగా జీవిస్తూ తమ కుటుంబాల్ని అంతే బాధ్యతగా చూసుకుంటుంటారు. ఇలా ప్రేమ, దేశభక్తి అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రమిది. దీన్ని దేశ సైనికుల సతీమణులకు, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరు నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్లో విడుదల చేస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, సుభద్ర రెడ్డి, మారి ప్రవీణ్ కుమార్, కల్నల్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
సందేశాత్మకం ‘కమిట్మెంట్’
తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కమిట్మెంట్’ (Commitment). లక్ష్మికాంత్ చెన్న దర్శకుడు. బల్దేవ్ సింగ్, నీలిమ.టి సంయుక్తంగా నిర్మించారు. అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహారెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో మంచి మెసేజ్ ఉంది’’ అన్నారు. ‘‘దీంట్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నా.. అవి ఎందుకున్నాయి అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అన్నారు నిర్మాత నీలిమ. నాయిక తనిష్క్ రాజన్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చూశాక చాలా మంది నా క్యారెక్టర్కు కనెక్ట్ అవుతారు. ప్రతి మహిళా చూడాల్సిన చిత్రమిది’’ అంది. కార్తీక్, సూర్య శ్రీనివాస్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన హాస్యంతో ‘కళాపురం’
సత్యం రాజేష్ (Satyam Rajesh), చిత్రం శ్రీను, కషిమా రఫీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కళాపురం’ (Kalapuram). ఇక్కడ అందరూ కళాకారులే.. అనేది ఉపశీర్షిక. కరుణ కుమార్ దర్శకుడు. జీ స్టూడియోస్తో కలిసి ఆర్ 4 ఎంటర్టైన్మెంట్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆరోగ్యవంతమైన హాస్యంతో సినిమా చేయాలని ఈ కథ రాసుకున్నా. హింస, అశ్లీలత లేకుండా తెరకెక్కించాం. మంచి కంటెంట్తో కూడిన ఈ సినిమాకి ప్రేక్షకుల ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చిత్రీకరణని ఆస్వాదిస్తూ పక్కా ప్రణాళికతో పూర్తి చేశాం. ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘అందమైన హాస్యంతో కూడిన చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర కాలం ఈ బృందంతో కలిసి ప్రయాణం చేస్తున్నా. వంద శాతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే చిత్రమిది’’ అన్నారు సత్యం రాజేష్. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రని ఇందులో చేశానని, చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటారన్నారు చిత్రం శ్రీను. జీ స్టూడియోస్ నిమ్మకాయల ప్రసాద్తోపాటు చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్