క్లాప్‌ కొట్టేశారు

విజయ్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్నారు.

Published : 06 Dec 2022 01:08 IST

విజయ్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందని సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ‘లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా కనిపించనున్నట్లు తెలిసింది. జనవరిలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. తొలి షెడ్యూల్‌ను కశ్మీర్‌, మున్నార్‌ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని ప్రచారం వినిపిస్తోంది. కథానాయికగా త్రిష పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని