NTR: యాక్షన్‌ హంగామా మొదలు

ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు.

Updated : 31 Mar 2023 07:13 IST

న్టీఆర్‌ (NTR) - కొరటాల శివ (Koratala Siva) కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో గురువారం నుంచి తొలి షెడ్యూల్‌ మొదలైంది. ‘‘విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ఎన్టీఆర్‌ ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని