నాకోసం అమ్మ నిర్మాతగా మారింది!
నాగశౌర్య... చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, కానీ ఏ క్యారెక్టర్లోనైనా పక్కాగా ఇమిడిపోతాడు. హీరోగా చేస్తాడు, అదే సమయంలో మంచి సినిమా అంటే హీరోయిన్ పక్కన సాధారణ పాత్ర చేయడానికీ వెనకాడడు. నటుడు అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి
నాగశౌర్య... చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, కానీ ఏ క్యారెక్టర్లోనైనా పక్కాగా ఇమిడిపోతాడు. హీరోగా చేస్తాడు, అదే సమయంలో మంచి సినిమా అంటే హీరోయిన్ పక్కన సాధారణ పాత్ర చేయడానికీ వెనకాడడు. నటుడు అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు రచయితగానూ మారాడు. ‘నేనేది చేసినా సినిమా కోసమే’ అంటోన్న ఈ యువ కథానాయకుడు తాజాగా ‘అశ్వథ్థామ’ అవతారమెత్తాడు. ఆ సంగతులన్నీ మనతో పంచుకుంటున్నాడిలా...
నేను పుట్టింది ఏలూరులో. పెరిగింది విజయవాడ, హైదరాబాద్లలో. చిన్నపుడు అమ్మ నన్ను కొట్టిమరీ చదివించేది. ఇంటర్మీడియెట్కి వచ్చాక నాకు సినిమాలు ఇష్టమనీ, ఎప్పటికైనా నటుడిగా స్థిరపడతాననీ చెప్పాను. ఏం ఆలోచించిందో ఏమో, ‘నీ ఇష్టం. కానీ ముందు డిగ్రీ పూర్తిచెయ్యి’ అంది.
ఆ తర్వాత నుంచి చదవమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. చదువు విషయంలో అమ్మానాన్నలకి దిగులు లేకుండా చేశాడు అన్నయ్య. వాడు ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డాడు. నేను డిగ్రీ చదువుతూనే అరుణ భిక్షు గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. 2007 నుంచి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఫొటోలు పంపడం, ఆడిషన్స్ ఇవ్వడం, వారి నుంచి ఎలాంటి పిలుపూ రాకపోవడం... దాదాపు ఆరేళ్లు ఇదే తంతు. రెండు సినిమాల్లో తక్కువ నిడివి పాత్రలు వస్తే వదల్లేక చేశాను. ‘వారాహి’ బ్యానర్లో నటించేందుకు కొత్తవాళ్లు కావాలన్న ప్రకటనని చూసి ఫొటోలు పంపాను. వారికి నచ్చి ఆడిషన్స్కి పిలిచారు. అవసరాల శ్రీనివాస్ దర్శకుడు. డెమో వీడియోలు చూపించమంటే చూపించాను. ఆడిషన్స్ చేయించి మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేశారు. 20 రోజులైనా పిలుపు రాలేదు. దాని సంగతీ ఇక అంతే అనుకున్నాను. కానీ ఓరోజు వారాహి ఆఫీసుకి రమ్మని ఫోన్... వెళ్లి చూస్తే అక్కడ అవసరాల శ్రీనివాస్తోపాటు కీరవాణి, రాజమౌళి, నిర్మాత సాయి కొర్రపాటి, ఇంకా చాలామంది ఉన్నారు. ‘నువ్వే మా సినిమాలో హీరో’ అన్నారు శ్రీనివాస్. కీరవాణిగారి చేతులమీదుగా చెక్ అందించారు.
ఆ సినిమానే ‘ఊహలు గుసగుసలాడే’. చెక్ పట్టుకుని ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకు చూపించాను. ‘నిజమేనా’ అంటూ హత్తుకున్నారు. ఆ చెక్ని ఇప్పటికీ డ్రా చేయలేదు.
అదే టర్నింగ్ పాయింట్...
2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ నాకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఆరేళ్లపాటు సినిమా కష్టాలు పడ్డాను. ఆ కష్టాలు పడకపోతే ఈరోజు మీ ముందు ఉండేవాణ్ని కాదేమో. ఎందుకంటే సినిమా ఛాన్స్ దొరకడం ఎంత కష్టమో తెలిసినపుడే సినిమాల ఎంపికలోనూ నటనపరంగానూ జాగ్రత్త పడతాం. ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్టు చదివినపుడే అది హిట్ అవుతుంది అనిపించింది. అనుకున్నట్టే ఆ సినిమా హిట్ అయి నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఇండస్ట్రీలో కొనసాగగలను అన్న ధైర్యం నాకు వచ్చింది ఆ సినిమాతోనే. అదే సంవత్సరం వారాహి బ్యానర్లోనే చేసిన ‘దిక్కులు చూడకు రామయ్యా’ కూడా మంచి హిట్ అయింది. అప్పట్నుంచీ మరింత సీరియస్గా పనిచేయడం మొదలుపెట్టాను. కామెడీ, యాక్షన్ కంటే కూడా మంచి ఎమోషన్స్ ఉన్న కథల్నే ఎంచుకుంటాను. కేవలం కామెడీ చూపిస్తామంటే ప్రేక్షకులు జబర్దస్త్ చూసుకుంటారు. సినిమా హాల్ వరకూ రావాల్సిన పనిలేదు. కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి... ఇలా అన్నీ భావోద్వేగాలు ఉన్న కథల్ని చేస్తూ వచ్చాను. అన్నీ హిట్ కాలేదు. కానీ ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా సంబరపడలేదూ, కుంగిపోలేదు. అదంతా ప్రయాణంలో భాగమే అనుకుంటాను.
అందుకే సొంత బ్యానర్...
చుట్టూ జరిగే సంఘటల్ని పరిశీలించేటపుడు సినిమా కథగా రాయొచ్చనిపించేవి కొన్ని ఉంటాయి. సినిమాల్లో ఉండటం వల్లనేమో నాకు అలాంటి సంఘటనలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. దాంతో కథలు రాయడమూ మొదలుపెట్టాను. అలా రాసిందే ‘ఛలో’. ఆ కథని ఏడాదిపాటు రాశాను. స్క్రిప్టు దశలో ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుమల కూడా తోడయ్యాడు. స్క్రిప్టు పూర్తయ్యాక ఓ నిర్మాతని సంప్రదిస్తే ‘కథ బాగుంది. కానీ, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. నీ మార్కెట్కి అంత బడ్జెట్తో తీయలేను. దానికితోడు దర్శకుడికి ఇదే మొదటి సినిమా. రిస్కు చేయలేను’ అన్నాడు. ‘మరొక్కసారి ఆలోచించండి’ అని అడిగినా ససేమిరా కుదరదన్నాడు. చిన్నప్పట్నుంచీ నేను ఏ విషయాన్నీ అమ్మ దగ్గర దాచను. జరిగిందంతా అమ్మకి చెప్పాను. చాలా భావోద్వేగాలకు గురిచేసిన సందర్భం అది. ‘నువ్వు బాధ పడితే నేను చూడలేను నాన్నా. నేనే ఈ సినిమాకి నిర్మాతగా ఉంటా’ అని చెప్పింది. ‘ఏంటమ్మా ఎమోషన్లో ఏదో మాట్లాడుతున్నావు. సినిమా నిర్మాణం గురించి నాకే తెలీదు. నువ్వు ఎలా చేయగలవు’ అని అడిగాను. ‘చేస్తా నాన్నా’ అంది. నాన్న భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆర్థికంగా మాది ఉన్నత కుటుంబమే. కానీ సినిమా నిర్మాణం గురించి ఏమీ తెలీదు. అమ్మకి నామీద ఉన్న ప్రేమ, దర్శకుడు వెంకీ మీద నాకున్న నమ్మకం కారణంగా సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’ ప్రారంభించాం. ఇంటి నుంచి ఎప్పుడూ బయటకు రాని అమ్మ నాకోసం రోజూ ఆఫీసుకి వచ్చేది. షూటింగ్ సమయంలోనే ఒక్కొక్క విషయమూ తెలుసుకుంటూ పనిచేసింది. నాన్న, బాబాయి కూడా షూటింగ్ ప్రారంభం నుంచి రిలీజ్ వరకూ సినిమా పనిమీదే ఉన్నారు. అన్నయ్య కూడా సినిమా రిలీజ్కి ముందే అమెరికా నుంచి వచ్చి ప్రచార బాధ్యతల్ని తీసుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మేం పెట్టినదానికి పది రెట్లు లాభాలు వచ్చాయి. ఏ నిర్మాణ సంస్థకైనా మొదటి సినిమా హిట్ రావాలి. లేకపోతే రెండో సినిమా తీయడానికి ధైర్యం చాలదు. అదృష్టంకొద్దీ మాకూ ‘ఛలో’ రూపంలో అది దొరికింది. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్లో, ఇంజినీర్లో అవుతారు. కానీ నటుడిగా నా కల తీర్చడానికి కుటుంబ సభ్యులంతా నాకు చేయూతనివ్వడం ఎంత అదృష్టం! ‘నాకోసం అంత కష్టపడే వాళ్ల రుణం ఎలా తీర్చుకోగలను’ అనిపిస్తుంది ఒక్కోసారి. నేను చేయగలిగిందల్లా వారికి చెడ్డపేరు తేకుండా ఉండటమే అనుకుంటాను.
మర్నాడే ప్రారంభిస్తా...
కొన్ని సినిమా కథలు విన్నపుడూ కాగితం మీదా బాగానే ఉంటాయి. కానీ సెట్స్మీదకు వెళ్లేసరికి చాలా మార్పులు వచ్చేస్తాయి. చాలామంది నటులు ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా అది తమ పరిధిలో లేని పని అనుకుని వదిలేస్తారు. అలాంటపుడు అవసరమైతే రీషూట్ చేయాలి. ఈ విషయంలో బయట నిర్మాతల్ని అన్నిసార్లూ ఒప్పించలేం. అదే సొంత నిర్మాణ సంస్థ అయితే ధైర్యం చేయగలం. అలాగని సినిమా ఫలితం పూర్తిగా మనచేతుల్లోనే ఉంటుందని అనను. ‘ఛలో’ తీస్తున్నపుడే మంచి హిట్ అవుతుందనుకున్నాం. ‘నర్తనశాల’ బాగా రావడం లేదని ముందే తెలిసిపోయింది. సినిమా ప్రకటించాం కాబట్టి పూర్తిచేశాం. మా బ్యానర్లో రెండు సినిమాల అనుభవంతో ‘అశ్వథ్థామ’ తీశాం. దీనికి కథ నేనే రాశాను. ముంబయి, దిల్లీల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కథకు మూలం. దర్శకుడు రమణ తేజ, అసిస్టెంట్ డైరెక్టర్ పరశురామ్ స్క్రిప్టు విషయంలో సాయపడ్డారు. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలీదు. సినిమా చేస్తున్నంతసేపూ దానిమీదే దృష్టి ఉంటుంది. మధ్యలో ఏదైనా సంఘటన, వార్త కథకి స్ఫూర్తినిస్తే దాని లైన్ రాసిపెట్టుకుంటాను. చేస్తున్న సినిమా రిలీజైన మరుసటి రోజునుంచే కొత్త స్క్రిప్ట్ రాయడంమీద దృష్టి పెడతాను. సినిమా హిట్ అయితే ఎంతో ఉత్సాహంగా, ఫట్ అయితే మరెంతో శ్రద్ధగా కథ రాస్తాను. నటించడం, కథలు రాయడం, సొంత నిర్మాణ సంస్థని నడపడం... ఇవన్నీ భారం అనుకోను. బాధ్యత అనుకుంటాను. నచ్చిన రంగంలో పనిచేయాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే. నిర్మాతగా రూపాయికి రూపాయి రాకపోయినా ఫర్వాలేదు, పోకూడదు అనుకుంటాను.
సినిమా స్నేహితులు
సినీ పరిశ్రమలో నాకు చాలా మంచి స్నేహితులున్నారు. వారిలో ముందుండేది అవసరాల శ్రీనివాస్, నందినీరెడ్డి. సినిమా కథలు రాయడం మొదలుపెట్టాక ప్రాథమికంగా అనుకున్న లైన్ని వీరిద్దరికీ చెబుతాను. వాళ్ల సలహాలూ, సూచనల మేరకు స్క్రిప్టుమీద పనిచేస్తాను. వాళ్ల రైటింగ్ శైలి నాకు నచ్చుతుంది. నారా రోహిత్ నాకు మంచి స్నేహితుడు. సినిమా కోసం 24 గంటలూ కష్టపడి ఒత్తిడికి గురవుతానని నా గురించి ఆందోళన చెందుతాడు. ‘ఇష్టంతో పడుతున్న కష్టం’ అని సర్దిచెబుతాను. హీరోయిలో మాళవిక, నిహారిక, రష్మిక, రాశీఖన్నా మంచి స్నేహితులు. సినిమాలకు సంబంధంలేని ఎన్నో విషయాల్ని మేం మాట్లాడుకుంటుంటాం.
కార్లంటే ఇష్టం...
నాన్న శంకర్ ప్రసాద్ ముల్పూరి. అమ్మ ఉష, అన్నయ్య గౌతమ్. ఇదే మా కుటుంబం.
* భోజనప్రియుణ్ని. బిర్యానీ, మటన్, కీమా నుంచి టమోటా పప్పు, ఆలూ ఫ్రై వరకూ అన్నీ తింటాను. వ్యాయామం కండల కోసం కాదుగానీ ఫిట్నెస్ కోసం చేస్తాను. కానీ అశ్వథ్థామ కోసం మాత్రం కండలు పెంచాను. లవర్బాయ్ లుక్కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లూ ఉంటుందనిపించింది. అలాగని ఎప్పటికీ ఇలానే ఉండిపోను.
* ట్రావెలింగ్ అంటే చిరాకు. పనిలేకపోతే ఇంట్లోనే ఉంటాను. అదే నాకు హాలిడే ట్రిప్. ఇంట్లో నచ్చిన సినిమాలు చూస్తాను, పెట్స్తో ఆడుకుంటాను. నచ్చింది వండించుకుని తింటాను. రిలాక్స్ అవడమంటే శరీరానికీ కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ట్రావెలింగ్ పేరుతో బ్యాగులు సర్దుకుని ఫ్లైట్ల కోసం గంటలకొద్దీ వెయిట్ చేయడం నాకు నచ్చదు.
* పుస్తకాలు చదవను. కానీ సినిమా కథకోసం అవసరమైన పుస్తకాల్ని తిరగేస్తా.
* ‘ఐరా’ సరస్వతీదేవి పేరు. నాకు ఏనుగులంటే ఇష్టం. ఐరావతం పేరునుంచీ రెండు అక్షరాలూ కలిసొచ్చేలా మా సంస్థకి ఆ పేరుపెట్టాం.
* నాకు కార్లంటే పిచ్చి. అమ్మానాన్న నాకు కార్లనే గిఫ్ట్లుగా ఇస్తుంటారు. పోర్షె, బెంజ్, ఆడి... ఇలా 13 కార్లు ఉన్నాయి నా దగ్గర. బాధ కలిగినా, సంతోషం అనిపించినా లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటా. షూటింగ్ కోసం వైజాగ్ కూడా కారులోనే వెళ్లిపోతుంటాను.
* ప్రస్తుతం పీపుల్స్ మీడియా, నార్త్స్టార్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో మూడు సినిమాలు చేస్తున్నాను.
‘బూ’ రోజంతా నాతోనే!
నా పెట్ ‘బూ’ గురించి చెప్పాలి. దానికిపుడు తొమ్మిది నెలలు. 40 రోజుల వయసునుంచి నాతోనే ఉంటోంది. అశ్వథ్థామ డైరెక్టర్ రమణతేజ దీన్ని ఇటలీ నుంచి తెప్పించి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది ‘కేన్ కోర్సో’ జాతికి చెందిన కుక్క. ఇవి 2-3 ఉంటే పులిని కూడా చంపేయగలవు. అంత శక్తి ఉంటుంది వీటికి. కానీ నేను దీన్ని చాలా సాత్వికంగా మార్చేశాను. నాతోపాటు షూటింగ్లకు తీసుకువెళ్తుంటాను. గొలుసు కూడా కట్టను. దాంతో మనుషుల మధ్య ఉండటానికి అలవాటు పడిపోయింది. నా పక్కనే పడుకుంటుంది, ఇప్పటివరకూ 23 డాగ్స్ పెంచాను. వాటిని ఫ్రెండ్స్, కజిన్స్ పెంచుకుంటామంటే ఇచ్చేశాను. నేను కూడా వాటితో టైమ్ గడపలేకపోయేవాణ్ని. అందుకే ‘బూ’కి నాతోపాటే ఉండటం అలవాటు చేశాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ