ఒక సమాధానం ఆమె జీవితాన్నే మార్చేసింది
చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి కుటుంబంపై ఆధారపడిన ఆమె.. తనకున్న తెలివితేటలతో, తల్లిదండ్రుల సహకారంతో ఇంటి గడప దాటి బుల్లితెరపై మెరిసింది. అంతే ఆమె కృషికి అదృష్టం తోడై.. ఒక్కసారిగా కోటీశ్వరాలుగా మారింది. శారీరకంగా లోపం ఉన్నప్పటికీ...
రూ.కోటి సొంతం చేసుకున్న దివ్యాంగురాలు
చెన్నై: చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి కుటుంబంపై ఆధారపడిన ఆమె.. తనకున్న తెలివితేటలతో, తల్లిదండ్రుల సహకారంతో ఇంటి గడప దాటి బుల్లితెరపై మెరిసింది. అంతే ఆమె కృషికి అదృష్టం తోడై.. ఒక్కసారిగా కోటీశ్వరురాలుగా మారింది. శారీరకంగా లోపం ఉన్నప్పటికీ తెలివి తేటల్లో ఇతరులకు ఏమాత్రం తీసిపోనని ఆమె నిరూపించింది. ‘కౌన్ బనేగా కరోడ్పతి’.. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ గేమ్ షో. ఈ కార్యక్రమాన్ని తమిళంలో ‘కోటీశ్వరి’ అనే పేరుతో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి అగ్రకథానాయిక రాధిక శరత్ కుమార్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ ఎపిసోడ్లో మధురైకు చెందిన కౌశల్య కార్తీక అనే దివ్యాంగురాలు పాల్గొన్నారు.
ఆమె రూ.కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి మొదటిసారి కోటి గెలుచుకున్న కంటిస్టెంట్గా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆమెను కోటీశ్వరాలిని చేసిన ఆ ప్రశ్న ఏమిటంటే.. ‘1948లో ప్రచురించిన ఏ నవలలో పులకేశి-2 రాజు.. తమ్ముడు నాగ నంది గురించి ప్రస్తావించారు?’ దీనికి కార్తీక ‘శివగామియిన్ సబాతామ్’ అనే సరైన సమాధానాన్ని చెప్పి రూ.కోటిని తన సొంతం చేసుకున్నారు. రియాల్టీ షో అనంతరం ఆమె విలేకర్లతో తన భావాలను వ్యక్తం చేస్తూ.. ‘చిన్నతనం నుంచి నా రోజువారీ జీవితంలో ప్రతి పని కోసం తల్లిదండ్రులపై ఆధారపడే దాన్ని. జీవితంలో ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకున్నాను. నా కలలను సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పించిన రియాల్టీ షో వారికి ధన్యవాదాలు. ప్రముఖ నటి రాధిక వ్యాఖ్యాతగా వ్యవహిరించిన ఈ షోలో పాల్గొని హాట్ సీట్లో కూర్చొవడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను విజేతను అయ్యానని ఈ ప్రపంచానికి గర్వంగా చెబుతున్నాను. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి నావంతు సాయం చేస్తాను. నేను విద్యనభ్యసించిన నాగర్కోయిల్లోని మూగ, చెవుడు పాఠశాలకు నావంతు సాయం అందిస్తాను. ఇటలీ లేక స్విట్జర్లాండ్ వెళ్లాలనే నా కలను నెరవేర్చుకుంటాను’ అని తన భావాన్న వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.