తొలి సినిమా ఫట్.. కెరీర్ మాత్రం హిట్!
సినిమా ఇండస్ట్రీ.. ఓ కలల ప్రపంచం.. రంగుల ప్రపంచం.. ‘శ్రీదేవిలా ఉన్నావ్.. జయసుధలా నటిస్తున్నావ్’ అంటుంటే హీరోయిన్ అయిపోదామని ఎన్నో ఆశలు, ఆశయాలతో చిత్ర పరిశ్రమకు వస్తారు. ఎలాగో అవకాశం దక్కించుకుని కథానాయికగా నటిస్తారు. ఆ నటించిన తొలి చిత్రం ఫట్మంటే..
ఐరన్లెగ్ అన్నవారే.. డేట్స్ కోసం ఎదురు చూశారు
సినిమా ఇండస్ట్రీ.. ఓ కలల ప్రపంచం.. రంగుల ప్రపంచం.. ‘శ్రీదేవిలా ఉన్నావ్.. జయసుధలా నటిస్తున్నావ్’ అంటుంటే హీరోయిన్ అయిపోదామని ఎన్నో ఆశలు, ఆశయాలతో చిత్ర పరిశ్రమకు వస్తారు. ఎలాగో అవకాశం దక్కించుకుని కథానాయికగా నటిస్తారు. ఆ నటించిన తొలి చిత్రం ఫట్మంటే.. ఇంకేముంది, ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. సినిమా ఏ కారణంగా విఫలమైనా సరే.. హీరోయిన్ను కూడా కారణంగా చూపిస్తారు. అలాంటి విమర్శల్ని, ఆరోపణల్ని అధిగమించి కసితో కథానాయికగా నిలదొక్కుకున్నారు కొందరు అందాల తారలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. చాలా మంది ముద్దుగుమ్మలు ఇలాంటి నిందలు మోశారు. కసితో శ్రమించి విమర్శించిన వారితోనే హిట్టు భామ అనిపించారు. నేడు స్టార్ హీరోయిన్లుగా సుదీర్ఘ కాలంగా వెలుగొందుతున్నారు. అలాంటి తారలెవరో చూద్దామా!
సినిమా పేరు మాత్రమే ‘సూపర్’
అప్పటి వరకు యోగా టీచర్గా ఉన్న మంగళూరు బ్యూటీ అనుష్క అనుకోకుండా నటిగా మారారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘సూపర్’ (2005) సినిమా కోసం కొత్త నటి కావాలని చూస్తున్న సమయంలో అనుష్క గురించి తెలిసింది. ఆమెను రప్పించి నాగార్జున సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘మహానంది’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అనుష్కపై ఐరన్లెగ్ మార్క్ పడింది. కానీ ‘విక్రమార్కుడు’, ‘అరుంధతి’, ‘బిల్లా’, ‘సింగం’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సినిమాలతో తనంటే ఏంటో నిరూపించారు అనుష్క. నేడు స్టార్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.
మొదట అంతగా ‘ఇష్ట’ పడలేదు.
దాదాపు 20 ఏళ్లకుపైగా చిత్ర పరిశ్రమలో కథానాయికగా అలరిస్తున్న భామ శ్రియ. ఓ వీడియో ఆల్బమ్ ద్వారా గుర్తింపు పొందిన ఆమె ‘ఇష్టం’ సినిమాతో 2001లో వెండితెరకు పరిచయం అయ్యారు. విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చరణ్ దొడ్ల కథానాయకుడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. శ్రియ ఆపై నాగార్జునతో కలిసి ‘సంతోషం’ సినిమాలో నటించి గుర్తింపు పొందారు. అలా ‘నువ్వే నువ్వే’, ‘ఠాగూర్’, ‘ఛత్రపతి’, ‘మనం’, ‘దృశ్యం’ తదితర సినిమాలతో తనదైన ముద్ర వేయడమే కాదు, అటు అగ్ర కథానాయకులతో పాటు, ఇటు యువ హీరోలతోనూ ఆడిపాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్ర కథానాయకులకు జోడీ అంటే గుర్తొచ్చే పేర్లలో శ్రియ ఒకరు.
తొలి సినిమా అన్‘లక్’
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెరపై మెరిశారు శ్రుతిహాసన్. ‘లక్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రుతికి దురదృష్టం వెంటాడింది. తెలుగులో ఆమె నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ ఫ్లాప్ అయ్యింది. ఇంకేముందు ఐరన్ లెగ్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. పలు హిందీ, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపురాలేదు. 2012లో పవన్కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’తో బ్రేక్ వచ్చింది. ‘బలుపు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్’ తదితర సినిమాలతో ఆమె హిట్లు అందుకున్నారు. నటిగానే కాకుండా గాయనిగానూ అలరిస్తున్నారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.
‘కెరటం’ ఉవ్వెత్తున ఎగరలేదు
దక్షిణాదితోపాటు బాలీవుడ్లోనూ సత్తా చాటిన నటి రకుల్ప్రీత్ సింగ్. కాలేజీ రోజుల్లోనే మోడల్గా పనిచేసిన ఆమె 2011లో ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొన్నారు. ఐదో స్థానంలో నిలిచి, పలు అవార్డులు గెలుచుకున్నారు. 2011లో ‘కెరటం’తో టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఈ సినిమా పరాజయం పొందింది. ఆపై 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో హిట్ అందుకున్నారు. ‘కరెంట్ తీగ’, ‘లౌక్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకుప్రేమతో..’, ‘ధృవ’ తదతర చిత్రాలతో తెలుగు తెరపై అలరించారు. ఇప్పుడు ఆమె చేతిలో పలు హిందీ ప్రాజెక్టులున్నాయి.
‘శ్రీ’కారం చుట్టినా..
తెలుగు వారికి దగ్గరైన మిల్కీబ్యూటీ తమన్నా తొలి సినిమా ‘శ్రీ’ (2005). మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆపై తమన్నా కోలీవుడ్లో అదృష్టం పరీక్షించుకున్నారు. తిరిగి 2007లో ‘హ్యాపీడేస్’తో తెలుగులో బ్రేక్ అందుకున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్’, ‘రచ్చ’, ‘బాహుబలి’ తదితర సినిమాలో స్టార్గా ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషా చిత్రాల్లోనూ తమన్నా నటిస్తున్నారు. అక్కడ కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు.
‘లక్ష్మీ కళ్యాణ’ వైభోగమే..
నేడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ‘చందమామ’ కాజల్ అగర్వాల్. తెలుగులో ఆమె తొలి సినిమా 2007లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’. కల్యాణ్రామ్ కథానాయకుడిగా భారీ అంచనాల మధ్య వచ్చిన పర్వాలేదనిపించింది. మిశ్రమ రివ్యూలు అందుకుంది. అదే ఏడాది వచ్చిన ‘చందమామ’ ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. అలా కాజల్ ‘మగధీర’, ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘బృందావనం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘టెంపర్’.. తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తమిళంలోనూ దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన నటించారు. ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.
‘వర్షం’లో తడిసింది.. హిట్ వచ్చింది
దాదాపు 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న నటి త్రిష. ఆమె కెరీర్ కోలీవుడ్తో ఆరంభమైనప్పటికీ తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యారు. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో టాలీవుడ్ తెరపై తొలిసారి సందడి చేశారు. ఈ సినిమా హిట్ అందుకోలేకపోయింది. ఆపై ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..’, ‘అతడు’, ‘ఆరు’, ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే!’, ‘కృష్ణ’, ‘బుజ్జిగాడు’, ‘కింగ్’, ‘నమో.. వెంకటేశ’.. ఇలా అనేక హిట్లు అందుకున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా త్రిష నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.