Ghani: వరుణ్‌తేజ్‌ ‘గని’.. తెలంగాణలో టికెట్‌ ధరల తగ్గింపు!

వరుణ్‌తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘గని’. ఈ నెల 8న విడుదలకానుంది.

Published : 06 Apr 2022 05:17 IST

హైదరాబాద్‌: వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గని’. ఈ నెల 8న విడుదలకానుంది. భారీ బడ్జెట్‌ కాకపోవడంతో తెలంగాణలో ఈ సినిమాకు సంబంధించి మునుపటి టికెట్‌ ధరలే అందుబాటులోకి రానున్నాయి. ఈ సినిమా టికెట్‌ ధర మల్టీప్లెక్స్‌లో జీఎస్టీ సహా రూ. 200, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో జీఎస్టీ సహా రూ. 150గా ఉండనుంది. భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనప్పుడు ఐదో ఆటకు అనుమతినివ్వడంతోపాటు, సుమారు పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించి మల్టీఫ్లెక్స్‌ల్లో విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్‌ ధర రూ. 395 ఉండగా, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ. 225గా ఉంది.

‘గని’ చిత్రాన్ని బాక్సింగ్‌ నేపథ్యంలో నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని