Ranveer-Deepika: దీపికా-రణ్‌వీర్‌ల ఎపిసోడ్‌పై ట్రోల్స్‌.. స్పందించిన కరణ్‌ జోహార్‌

సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’ తొలి ఎపిసోడ్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. వీటిపై కరణ్‌ జోహార్‌ స్పందించారు.

Published : 30 Oct 2023 13:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ జోడి దీపికా-రణ్‌వీర్‌ల జంట ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు, ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అయ్యాయి. అయితే ఆ ఎపిసోడ్‌లో దీపిక చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఆ షో వ్యాఖ్యాత, ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) వీటిపై స్పందించారు.

ఆ ఎపిసోడ్‌ కారణంగా వారిని ట్రోల్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన కరణ్‌.. ‘‘ఆ ట్రోల్స్‌ నాదాకా చేరాయి. ట్రోలింగ్ కారణంగా ఎవరి స్థాయి తగ్గదు. అందుకే వాటిని పట్టించుకోకూడదు’ అని అన్నారు. అయితే, నిర్మాణాత్మక విమర్శలను అంగీకరించారు. రానున్న ఎపిసోడ్‌లలో వాటిని సరిచేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో అడిగే ప్రశ్నలు కొంచెం బోల్డ్‌గా ఉంటాయని తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి డేటింగ్‌ గురించి కరణ్‌ అడిగిన ప్రశ్నకు దీపిక (Deepika Padukone) చెప్పిన సమాధానం ట్రోలింగ్‌కు కారణమైంది.

ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు?.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఆగ్రహం..

ఇక ఆ ఎపిసోడ్‌లో దీపిక మాట్లాడుతూ.. ‘కొన్ని కారణాల వల్ల లైఫ్‌ అంతా నేను సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే, ఆ తర్వాత చాలా మందితో వృత్తి పరంగా నేను చనువుగా ఉన్నప్పటికీ రణ్‌వీర్‌ మాత్రమే నా మనసుకు దగ్గరయ్యారు. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకుని అతడితో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నా’ అని చెప్పారు. అయితే ఈ వీడియోలో కొంత భాగాన్ని ప్రచారం చేస్తూ నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌లో దీపికా-రణ్‌వీర్‌లు (Ranveer Singh) వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. అక్టోబర్‌ 26 నుంచి ఇది డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని