keerthy suresh: కీర్తి.. ఉప్పు కప్పురంబు

కీర్తి సురేశ్‌.. దక్షిణాది భాషల్లోనే కాకుండా ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మరో కొత్త చిత్రంతో సందడి చేయనుంది. ఆమె..సుహాస్‌ ప్రధాన..

Updated : 21 Mar 2024 11:00 IST

కీర్తి సురేశ్‌.. దక్షిణాది భాషల్లోనే కాకుండా ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మరో కొత్త చిత్రంతో సందడి చేయనుంది. ఆమె..సుహాస్‌ ప్రధాన పాత్రలో ఓటీటీలో అభిమానుల ముందుకు రానున్న చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. సెటైరికల్‌ కామెడీ డ్రామాగా అని ఐవీ శశి తెరకెక్కిస్తున్నారు. రాధికా ఎల్‌ నిర్మిస్తున్నారు. వసంత్‌ మురళీకృష్ణ మరింగంటి కథని అందించారు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ వేడుకలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఒక గ్రామం ఓ అసాధారణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అక్కడి ప్రజలు దానిని ఏ విధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.  ప్రస్తుతం ‘రఘుతాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ చిత్రీకరణలలో పాల్గొంటోంది కీర్తి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని