Chiranjeevi: వేరే హీరోల సినిమా ఫంక్షన్స్లో చిరు పాల్గొనడానికి కారణమదే..!
‘ఆచార్య’ ప్రమోషన్స్లో కొరటాల శివ-చిరంజీవి ప్రత్యేక చిట్చాట్
ఆసక్తికర విషయాలు పంచుకున్న శివ, చిరంజీవి
హైదరాబాద్: కొరటాలశివ-చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిరు-శివ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాని విశేషాలివే..
చిరంజీవితో సినిమా చేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా?
శివ: లేదు. పరిశ్రమలోకి అడుగుపెట్టి, విజయాన్ని అందుకుని, మెగాస్టార్తో సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ‘ఆచార్య’ ఓకే అనుకున్న తర్వాత చిరంజీవిగారితో ఫస్ట్డే ఫొటోషూట్ చేశాం. చిరు కెమెరా ముందుకు రాగానే నేను యాక్షన్ చెప్పడం మానేసి వెంటనే ఆయన వద్దకు వెళ్లి.. ‘సర్ నేను మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని. మీ సినిమా టికెట్ల కోసం థియేటర్ల వద్ద యుద్ధాలు చేశా. చొక్కాలు కూడా చింపేసుకున్నా. అలాంటిది ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నా. నాకెంతో ఆనందంగా ఉంది’ అని చెప్పాను.
చిరంజీవి: ‘ఆచార్య’ ఓకే చేయడానికి ముందు ఓ చిన్న సంఘటన జరిగింది. అసలు శివ.. మొదట రామ్చరణ్తో సినిమా చేయాలి. చరణ్-శివ ప్రాజెక్ట్ ఓకే అనుకున్నాక ఓసారి మేము ముగ్గురం డిన్నర్కి కలిశాం. అప్పుడు చరణ్.. ‘‘సర్.. ప్రస్తుతం నేను ‘ఆర్ఆర్ఆర్’లో బిజీగా ఉన్నాను. మీకు డేట్స్ ఇవ్వడం కాస్త ఆలస్యం కావొచ్చు. మీకు ఓకే అనుకుంటే మా నాన్నతో సినిమా చేయండి’’ అని చెప్పాడు. దానికి నేను కూడా నా ఇష్టాన్ని వ్యక్తం చేశాను. ఆ క్షణం శివ ఆనందానికి హద్దుల్లేవు. ‘‘చరణ్ మీతో నేను ఎప్పుడైనా సినిమా చేయవచ్చు. నాన్నతో సినిమా చేసే అవకాశం ఎప్పటికో కానీ రాదు. కాబట్టి నేను చేస్తా’’ అని చెప్పారు.
శివ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
చిరంజీవి: అత్యద్భుతంగా అనిపించింది. కథ విన్న వెంటనే నేను వందశాతం ఓకే అనుకున్న సినిమాలన్నీ బ్లాక్బస్టర్స్, సూపర్హిట్స్ అయ్యాయి. నేను తర్జనభర్జన పడిన స్క్రిప్ట్స్ అన్నీ డివైడ్ టాక్కే పరిమితమయ్యాయి. అలా, ‘ఆచార్య’ కథ విన్నా వెంటనే నాకు నచ్చేసిందని చెప్పేశా.
చరణ్ ఎప్పుడు? ఎలా? ఈ కథలోకి ఎంట్రీ ఇచ్చారు?
శివ: కథ అనుకున్నప్పుడే ఇందులో సిద్ధ అనే క్యారెక్టర్ ఉంది. స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు కథలో అది మరింత పవర్ఫుల్ రోల్గా మారింది. సిద్ధ పాత్రలో ఎన్నో ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. దానికి చరణ్ అయితేనే న్యాయం చేయగలరనిపించింది. వెంటనే అదే విషయాన్ని చిరంజీవితో పంచుకున్నా. ‘పర్ఫెక్ట్. చరణ్ సరిగ్గా సరిపోతాడు. కానీ, నేను అయితే చరణ్ని చేయమని అడగను. నువ్వు వెళ్లి రోల్ చెప్పి.. ఛాన్స్ ఉంటే చేయమను’ అని చిరంజీవి అన్నారు. అలా, చరణ్ని కలిసి పాత్ర వివరించాను. ఆయన వెంటనే.. ‘‘చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేసే అవకాశం రావడం డ్రీమ్ కమ్ ట్రూ. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నా. కాబట్టి తప్పకుండా చేస్తా’ అని అన్నారు.
చిరంజీవి: చరణ్ ఈ రోల్ చేస్తే బాగుంటుందని నాకు ముందు నుంచే ఉంది. డైరెక్టర్ చెప్పగానే చరణ్ ఒప్పుకోవడం నాకెంతో ఆనందంగా అనిపించింది. చరణ్-నేనూ కలిసి చేస్తే చూడాలని సురేఖ కోరిక. ఆమె కోరిక ఈ రూపంలో తీరింది. మా ఇద్దరి పాత్రలను స్క్రీన్పై చూస్తే ప్రేక్షకులు తప్పకుండా భావోద్వేగానికి గురవుతారు.
చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపించింది..?
చిరంజీవి: చిన్నప్పుడు చరణ్ హాలీడేస్ ఉన్నప్పుడు సెట్స్కి వచ్చి నాతో టైమ్ స్పెండ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు, అతను ఒక నటుడిగా నాతో కలిసి సినిమా చేయడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. మారెడుమిల్లిలో షూట్ చేస్తోన్న సమయంలో మేమిద్దరం ది బెస్ట్ టైమ్ ఎంజాయ్ చేశాం. అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు ఓసారి సురేఖ ఫోన్ చేసి.. ‘‘మీ ఇద్దరూ ఒకేసారి యాక్ట్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. నేనూ లొకేషన్కి వస్తా’’ అని అడిగింది. నేను సరే అన్నప్పటికీ చరణ్ మాత్రం ఒప్పుకోలేదు. ‘‘లేదు అమ్మా.. నేను నాన్నతో ఈ క్షణాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు రావొద్దు’’ అని చెప్పాడు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివకు ధన్యవాదాలు.
నటుడు చరణ్, మీ అబ్బాయి చరణ్.. ఎలాంటి మార్పు గమనించారు?
చిరంజీవి: చిన్నప్పటి నుంచే చరణ్ ఆలోచనా విధానం ఎంతో ఉన్నతంగా ఉండేది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తాడు. ఇక, నటుడు చరణ్.. దర్శకులకు ఏం కావాలో వందశాతం ఇవ్వడానికి ఎప్పుడూ శ్రమిస్తాడు.
ఇద్దరు స్టార్స్ని ఒకే స్క్రీన్పై చూపించడమంటే కాస్త ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. మీరు ఎలా వర్క్ చేశారు?
శివ: ఈ సినిమాలో ఇద్దరివీ స్ట్రాంగ్ పాత్రలే. వాళ్లిద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలు సినిమాకి ఎంతో కీలకం. అవి షూట్ చేస్తున్నప్పుడు కూడా నేనస్సలు ఇబ్బంది పడలేదు. ఒక అభిమానిగా ఎంతో ఎంజాయ్ చేశా.
చిరంజీవి: తనకు సీన్స్ ఎలా కావాలో శివ చెప్పేవాడు. మేమిద్దరం ఫాలో అలా చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్లం.
శివ: సినిమా అంటే ఆయనకు బోర్ కొట్టదు. రేపు ఏం సీన్ చేయనున్నాం అనేది ముందు రోజే తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన సిద్ధమవుతారు.
చిరంజీవి: రేపు ఏం చేయనున్నాం.. అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే షూట్ మొత్తం కూల్, సాఫీగా సాగిపోతుందని నేను నమ్ముతాను.
‘చిరుత’ నుంచి ‘సిద్ధ’ వరకూ చరణ్లో ఒక నటుడిగా మీరు చూసిన మార్పు ఏమిటి?
చిరంజీవి: మొదటి సినిమా నుంచి చరణ్ నాకెంతో నచ్చేశాడు. కెరీర్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు.
సినిమా కోసం వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ ఎవరు?
శివ: కథ అనుకున్నప్పుడే టెంపుల్ థీమ్ కావాలని ఫిక్స్ అయ్యాం. దాని కోసం ఎంతో వర్క్ చేశాం. మా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ అద్భుతంగా ‘ధర్మస్థలి’ని క్రియేట్ చేశారు. తిరు మరింత అద్భుతంగా కెమెరా పనితనం చూపించారు.
చిరంజీవి: కోకాపేటలోని మా స్థలంలోనే ఆ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఓసారి ఉదయం పూట నేను సెట్కి వెళ్లి కూర్చున్నప్పుడు.. గాలిగోపురంలో తేనెపట్టు కనిపించింది. ‘‘మనం సెట్ వేసి కొన్నిరోజులే అయ్యింది. అప్పుడే తేనెపట్టు పట్టేసిందా? తీయించేయాల్సి కదా’’ అని నేను చెప్పగానే.. ‘‘లేదు సర్.. అది సురేశే పెట్టించారు’’ అని చెప్పారు. ఈ సినిమా కోసం సురేశ్ వందశాతం కష్టపడ్డారు. సాధారణంగా నేను ఎప్పుడూ టెక్నికల్ టీమ్ని వేరే సినిమాలకు రికమండ్ చేయను కానీ, సురేశ్ వర్క్ బాగా నచ్చడంతో ‘గాడ్పాధర్’కి రికమండ్ చేశా.
‘ధర్మస్థలి’ చూసే అవకాశం కల్పిస్తారా?
చిరంజీవి: ఈ సినిమా తర్వాత ‘ధర్మస్థలి’ టూర్ పెడదాం. అందరికీ చూసే అవకాశం కల్పిద్దాం.
మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా ఎలా జరిగింది?
చిరంజీవి: అది శివ ప్రయత్నమే.
శివ: ఫస్ట్ రెండు నిమిషాలు ధర్మస్థలి కథ చెబుతూ ఆ టెంపుల్ టౌన్లోకి తీసుకువెళ్లాలి. మనందరికీ తెలిసిన వాయస్ అయితే బాగుంటుందనిపించింది. అలా, ఓసారి మహేశ్బాబుని కలిసి చెప్పాను. ‘మన చిరంజీవిగారి సినిమానే కదా తప్పకుండా వాయిస్ ఇస్తా’ అన్నారు.
మీరు వరుసగా ఫంక్షన్లలో పాల్గొంటారు కదా?
శివ: ‘ఆచార్య’ షూట్ జరుగుతున్నప్పుడు ఓసారి నేను చిరంజీవి గారిని అడిగాను మీరు ఇలా వరుస ఫంక్షన్స్లో పాల్గొంటున్నారు. మీకు ఇబ్బందిగా అనిపించడం లేదా అని.. ‘‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా వద్దకు వచ్చినప్పుడువాళ్లలో నన్ను నేను చూసుకుంటున్నా. వాళ్లని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తున్నా’’ అని చెప్పారు
విలన్ ఎవరు?
శివ: సోనూసూద్, జిషు సేన్గుప్తా.. వాళ్లిద్దరూ ఇందులో ప్రతినాయకులుగా చేశారు.
మీకు ఇంతటి ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తోంది?
చిరంజీవి: అభిమానుల ఇచ్చే స్పందన నుంచే నాకు ఎనర్జీ వస్తోంది. చరణ్ చేసిన ‘నాటు నాటు’ చూశాక.. మేమిద్దరం కలిసి ఎలా డ్యాన్స్ చేస్తామో అని చిన్న సందేహం వచ్చింది. కానీ శేఖర్ మాస్టర్ అద్భుతంగా కంపోజ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.