నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
‘ఆటగదరా శివ’ ‘మిస్మ్యాచ్’ వంటి విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఉదయ్శంకర్ ‘క్షణక్షణం’ అంటూ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నారు. హీరోగా మొదటి చిత్రం నుంచే వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను
హైదరాబాద్: ‘ఆటగదరా శివ’ ‘మిస్మ్యాచ్’ వంటి విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఉదయ్శంకర్ ‘క్షణక్షణం’ అంటూ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నారు. హీరోగా మొదటి చిత్రం నుంచే వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. మరి ఆ క్రమంలోనే ప్రస్తుతం రాబోతున్న ‘క్షణక్షణం’ చిత్రం విశేషాలను ఉదయ్శంకర్ మనతో పంచుకున్నారు..
ఈసారి కమర్షియల్గానూ హిట్ కొడతాం..
నా గత చిత్రాలు ‘ఆటగదరా శివ’,‘మిస్మ్యాచ్’ చిత్రాలను ప్రేక్షకులు మంచి కథాబలమున్న సినిమాలుగా భావించినా.. కమర్షియల్ హిట్ సాధించలేకపోయాం. ఇప్పటికీ నా తొలి చిత్రం ‘ఆటగదరా శివ’ అమెజాన్ వ్యూస్ టాప్10లో ఉంటుంది. అందుకే ఈ సారి ఆ లోటుపాట్లన్నీ దిద్దుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ప్రముఖ నిర్మాత బన్నీవాసుగారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఆయనకు క్లైమాక్స్ బాగా నచ్చింది. కొన్ని మార్పులు కూడా సూచించారు. కచ్చితంగా ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసిన ఫీల్ పొందుతారు
కథ వినగానే ఒకే చెప్పేశా..
గతేడాది జూన్లో ఈ కథ విన్నాను. జులై నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాం. అప్పుడే లాక్డౌన్ ముగిసి షూటింగ్స్కు అనుమతి ఇచ్చారు. కథ మొత్తం వైజాగ్ సముద్రతీరంలో నడుస్తుంది. కానీ కరోనా దృష్ట్యా ఇంటీరీయర్ సీన్స్ అన్ని హైదరాబాద్లో షూట్ చేశాం. ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని వైజాగ్లో షూట్ చేశాం. సినిమా కూడ రెండుగంటల్లోనే ముగుస్తుంది. బన్నీవాసుగారు సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయమని చెప్పారు. లేకుంటే మంచి సినిమాను ప్రేక్షకులు మిస్ అవుతారని ఆయన అన్నారు. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడం మా అదృష్టం.
ఇందులో హీరో పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది..
ఈ చిత్రంలో నేను చాలా సహజంగా నటించా. ఎందుకంటే ఇందులోని ప్రధాన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఒక సగటు మనిషిగా మనం ఒకటనుకుంటే అవి జరగ్గపోగా కొత్త చిక్కులు వచ్చి పడుతుంటాయి. మోసపోతూ ఉంటాం. అప్పుడు మనం పడే మానసికవేదన వర్ణనాతీతం. ఆ సమస్యల నుంచి ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ స్క్రిప్ట్ను మలిచాం.
‘క్షణక్షణం’ అనే టైటిల్ హైప్ కోసం పెట్టలేదు.
ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేవరకు టైటిల్ నిర్ణయించలేదు. కొన్ని అనుకున్నాం కానీ, డైరెక్టర్ కార్తీక్కు నచ్చలేదు. ఆయనే ‘క్షణక్షణం’టైటిల్ పెడదామన్నారు. ఈ టైటిల్తో ఆర్జీవీ-వెంకీ-శ్రీదేవి కాంబోలో వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఆ బజ్ కోసం మేం టైటిల్ పెట్టలేదు. సినిమా చూశాక ‘క్షణక్షణం’మంచి టైటిల్ అని అందరూ భావిస్తారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆడియన్స్ ఊహించని విధంగా ఉండి ఉత్కంఠకు గురిచేస్తుంది. కథలో మిళితమైన డార్క్ కామెడీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. హీరోయిన్ జియా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
కోటీగారికి ఇది మొదటి చిత్రం..
సంగీత దర్శకుడు కోటి మా చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. నటుడిగా ఆయన మొదటి చిత్రం ఇది. ఆ లాయర్ పాత్రకు మొదట కీరవాణిగారిని అనుకున్నాం. కానీ, కోటీ కుమారుడు రోషన్ మా చిత్రానికి సంగీతం అందిస్తుండడంతో ఆయన్ను సంప్రదించాం. కోటీగారు కూడా ఏదోలా నటించేస్తే చాలు అనుకోకుండా పాత్రలో జీవించారు. తెరపై ఆయన నటనను చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టాల్సిందే. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం.
అనుకున్నది అనుకున్నట్టు తీశాం..
ఈ కథకు ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ ఎలా అనుకున్నామో అలాగే తెరకెక్కించాం. అంత కంటే బాగా వచ్చినా కూడా ఈ సినిమాకు ఇబ్బందే. అలాంటి స్టోరీ ఇది. రెండుగంటల్లో సినిమా ముగించాలని ముందునుంచే ప్లాన్ చేసుకున్నాం. మొత్తం 26 రోజుల్లో షూట్ పూర్తి చేశాం. ఈ చిత్రంలోని కీలకమైన కొన్ని సీన్లు వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో చేయాలి. అక్కడి అధికారులు ఇచ్చిన అనుమతితో, 42 మంది సిబ్బందితో, కరోనా జాగ్రత్తలు పాటించి చకచకా షూట్ ముగించాం. నిర్మాతల్లో ఒకరైన మౌళి, వర్మ చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు.
మా సినిమాలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు నటించారు..
ఈ చిత్రంలో కోటిగారితో పాటు రఘుకుంచె, ‘మిస్మ్యాచ్’కు మ్యూజిక్ అందించిన గిఫ్టన్ కూడా నటించడం విశేషం. వాస్తవానికి గిఫ్టన్ నా స్నేహితుడు. ముహూర్తం షాట్కు నాకు ఆల్దిబెస్ట్ చెప్పడానికి వస్తే ఆయన గెటప్ చూసి ఈ చిత్రంలో నటింపజేయాలని డైరెక్టర్ కార్తీక్ అనుకున్నారు. అలా గిఫ్టన్ ఈ సినిమాలో భాగమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి నటిస్తున్నపుడు మా మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ నేపథ్య సంగీతం అందిస్తుంటే థ్రిల్కు ఫీలయ్యాం.
ఈ సినిమా ఆడితేనే నాకు మరో సినిమా..
నా కుటుంబ నేపథ్యానికి, ఈ సినీ రంగానికి ఏ మాత్రం సంబంధం లేదు. నాలాంటోళ్లు జనానికి దగ్గరవ్వాలంటే కథాబలమున్న సినిమాలతోనే ముందుకెళ్లాలి. ఈ సినిమా ఫలితంపైనే నా సినీ భవిష్యత్తు ఆధారపడిఉంది. సినిమాలో కూడా ఒక సామాన్యుడి కష్టాలను కథగా చూపించాం. అదే మా సినిమాకు ప్రధాన బలం. చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల మునివేళ్లపై కూర్చోవటం ఖాయం. ఈ చిత్రంలో కేవలం 7 పాత్రలే ఉంటాయి.
విలన్ పాత్రలు కూడా చేస్తా..
ప్రస్తుతం అయితే హీరో పాత్రల్లో నటించాలని ఉంది. పాత్ర నచ్చితే విలన్ పాత్రలు చేయడానికైనా సిద్ధం. నటుడు విజయ్సేతుపతి నాకు ఆదర్శం. అలాగే ‘సఖి’లాంటి ఒక లవ్స్టోరీలో నటించాలని ఉంది. చివరిగా నేను చెప్పేది ఒకటే యూనిట్ అంతా నిజాయతీగా పనిచేశాం. కచ్చితంగా అందరూ మా ‘క్షణక్షణం’చిత్రాన్ని థియేటర్కు వచ్చి వీక్షిస్తారని ఆశిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!