Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Main Atal Hoon: పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్‌ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 11 Mar 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై అటల్‌ హూ’(Main Atal Hoon). బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి టైటిల్‌ పాత్ర పోషించారు. రవి జాదవ్‌ దర్శకుడు. జనవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

అజాత శత్రువులాంటి వ్యక్తి, రాజనీతిజ్ఞుడు అయిన అటల్ బిహారీ వాజ్‌పేయీ (atal bihari vajpayee) పాలనతో పాటు, రాజకీయ జీవితాన్ని మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అలాగే, ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం, స్నేహితులతో ఆయనకున్న బంధాన్ని కూడా తెరపై ఆవిష్కరించారు. కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్షలతో సహా చాలా అంశాలను ఇందులో ప్రస్తావించారు. పీయూష్ మిశ్రా, రాజా రమేశ్ కుమార్ (ఎల్‌.కె.అడ్వాణీ) , దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.  వినోద్‌ భానుశాలి, సందీప్‌ సంయుక్తంగా నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని