అక్కతో పార్టీలకు వెళ్లను.. కారణమదే: మంచు విష్ణు

తాను సంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తుంటానని నటుడు మంచు విష్ణు తెలిపారు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని అన్నారు. తన తదుపరి చిత్రం ‘మోసగాళ్లు’ ప్రమోషన్‌లో పాల్గొన్న విష్ణు తన వ్యక్తిగత జీవితం గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

Updated : 14 Mar 2021 14:47 IST

మనోజ్‌కు సలహాలివ్వను అంటోన్న నటుడు

హైదరాబాద్‌: తాను సంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తుంటానని, అంతేకాకుండా పార్టీ కల్చర్‌ అంటే తనకి అంతగా ఆసక్తి ఉండదని కథానాయకుడు మంచు విష్ణు అన్నారు. అందుకే తన కుటుంబ సభ్యులతోనే కాదు, ఎవరితోనూ పార్టీలకు పెద్దగా వెళ్లనని  చెప్పారు. తన తదుపరి చిత్రం ‘మోసగాళ్లు’ ప్రమోషన్‌లో పాల్గొన్న విష్ణు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్నారు.

‘‘లక్ష్మి, నేను, మనోజ్‌.. మా ముగ్గురిలో సంప్రదాయాలకు నేనే ఎక్కువగా విలువ ఇస్తుంటాను. పెద్దా, చిన్నా అనే పద్ధతులు నమ్ముతుంటాను. నేను కొంచెం బోరింగ్‌ పర్సన్‌. రాత్రి త్వరగా నిద్రపోవడం. ఉదయాన్నే నిద్రలేవడం.. ఇలా ఉంటుంది నా లైఫ్‌స్టైల్‌. కానీ వాళ్లిద్దరి లైఫ్‌స్టైల్‌ వేరేలా ఉంటుంది. వాళ్లిద్దరి ఆలోచనలు కొంచెం కలుస్తుంటాయి. దాంతో వాళ్లిద్దరూ స్నేహితులు, పార్టీలతో ఎంజాయ్‌ చేస్తుంటారు. నా దృష్టిలో ఎంజాయ్‌మెంట్‌ అంటే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, పిల్లలతో సమయాన్ని గడపడం’’ అని విష్ణు తెలిపారు.

అనంతరం మనోజ్‌కు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘లేదు. అడక్కుండా సలహాలిస్తే ఆ మాటకు విలువ ఉండదు. అలాగే సలహాలిచ్చే వ్యక్తికి కూడా గౌరవం ఉండదు.. అనే దాన్ని ఎక్కువగా నమ్ముతుంటాను. అవసరమైనప్పుడు అడుగుతారు. అడిగితే తప్పకుండా ఇస్తాను’’ అని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌-మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి  కీలకపాత్ర పోషించారు. నవ్‌దీప్‌, నవీన్‌చంద్ర తదితరులు నటించారు. అలాగే, ఈసినిమాలో విష్ణుకి అక్కగా కాజల్‌ కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని