Chiranjeevi: మాతృదినోత్సవం.. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన చిరంజీవి

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భూమ్మీద ఉన్న తల్లులందరికీ అభినందనలు తెలిపారు అగ్రకథనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి. తన అమ్మ అంజనాదేవి....

Updated : 08 May 2022 12:01 IST

మదర్స్ డే విషెస్‌ తెలిపిన తారలు

హైదరాబాద్‌: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భూమ్మీద ఉన్న తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి. తన అమ్మ అంజనాదేవి, సోదరులు పవన్‌కల్యాణ్‌, నాగబాబులతో కలిసి ఉన్న ఓ స్పెషల్‌ వీడియోని ఆయన ఆదివారం షేర్‌ చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్‌’, పవన్‌ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్‌’ల చిత్రీకరణ గతంలో ఓసారి హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతంలో జరిగింది. ఎప్పుడూ బిజీగా ఉండే చిరు-పవన్‌ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో అంజనాదేవి, నాగబాబు లొకేషన్‌కి చేరుకుని, సెట్‌లో కాసేపు సమయాన్ని గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని చిరు షేర్‌ చేయగా.. సెలబ్రిటీలందరూ హ్యాపీ మదర్స్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. చిరంజీవితోపాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అడివి శేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, సుధీర్‌బాబు, మోహన్‌లాల్‌.. ఇలా తారలందరూ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని