Mohan babu: చిరు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారు!
ప్రముఖ నటుడు మోహన్బాబు కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. శుక్రవారం
హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్బాబు కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. శుక్రవారం ఈ చిత్ర టీజర్ను నటుడు సూర్య విడుదల చేశారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి వాయిస్ ఓవర్తో విడుదలైన ఈ టీజర్లో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అలరిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి, సూర్యకు మోహన్బాబు ధన్యవాదాలు తెలిపారు.
‘‘నేను సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని తీస్తున్నానని నా అభిమానులకి, ప్రేక్షకులకు తెలుసు. ఆ చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. ‘చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుంది’ అని విష్ణు సలహా ఇచ్చాడు. ఇదే విషయాన్ని చిరుకు ఫోన్ చేసి అడిగాను. ‘ఎన్ని రోజులలో కావాలి బాబు’ అని చిరు అడిగారు. ‘పది రోజుల్లో ఎప్పుడైనా ఓకే’ అన్నాను. ‘ఆ వాయిస్ ఓవర్ మ్యాటర్ నాకు పంపు’ అని చిరు నుంచి సమాధానం వచ్చింది. తాను ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నా నేను అడిగిన వెంటనే మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి, డబ్బింగ్ చెప్పి పంపాలనుకున్నారు. ఆ విషయం నాకు తెలిసింది. డబ్బింగ్ థియేటర్కు విష్ణుని పంపాను. విష్ణును చూడగానే చిరంజీవి నవ్వుతూ ‘నిన్ను ఎవరు రమన్నారు. డబ్ చేసి మీ నాన్నకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా’ అన్నారట. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకి, అతని సహృదయతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’
‘‘సన్ ఆఫ్ ఇండియా టీజర్ జూన్ 4న నీ చేతుల మీదుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నా’ అని సూర్యకు చెప్పిన వెంటనే ‘నేను మీ ఫ్యామిలీ మెంబర్ని. విష్ణుతో మాట్లాడి ప్లాన్ చేసుకుంటాం. మీరు చెప్పిన సమయానికి రిలీజ్ అవుతుంది’ అని సూర్య అన్నారు. సూర్యకి నా మీద ఉన్న ప్రేమకి ధన్యవాదాలు. ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్కి అంచనాలను మించి ప్రేక్షకులకు, అభిమానులు స్పందించినందుకు ధన్యవాదాలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం’’ అని మోహన్బాబు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్