Naresh: రమ్య విషయంలో అప్పట్లోనే భయపడి నోటీస్ ఇచ్చా: నరేశ్
తన భార్య రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు నరేశ్ స్పష్టం చేశారు. రంభ ఉన్నతి అరోమా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ...
నాకెలాంటి సంబంధం లేదు.. మాకు ఇవ్వడమే తెలుసు.. తీసుకోవడం కాదు
హైదరాబాద్: రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు నరేశ్ స్పష్టం చేశారు. రంభ ఉన్నతి అరోమా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు రమ్య తమ నుంచి అప్పులు తీసుకుందని.. కానీ వాటిని తిరిగి చెల్లించడం లేదంటూ పలువురు బాధితులు మంగళవారం ఉదయం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో నరేశ్కు సైతం బాధితుల నుంచి ఫోన్కాల్స్ వస్తోన్న తరుణంలో ఆయన ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏడేళ్ల నుంచే తానూ, రమ్య దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు.
‘‘రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో బంధుమిత్రులు, మీడియా మిత్రుల నుంచి నాకు వరుస ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి. వారందరికీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఈ మొత్తం వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా జరిగిందనే విషయం కూడా రెండు రోజుల ముందు వరకూ నాకు తెలియదు. మా వివాహమై తొమ్మిదేళ్లయ్యింది. రమ్య ఈ విధంగా అప్పులు చేస్తోందని తెలిసి.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఊహించి 7 ఏళ్ల నుంచి ఆమెకు దూరంగా ఉన్నాను. మేమిద్దరం ఆనాటి నుంచి విడివిడిగా ఉంటున్నాం. మా జీవితాలు మేము జీవిస్తున్నాం. ప్రస్తుతం మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల ఆమెపై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని వార్తలు రావడంతో నాకెంతో భయం వేసింది. దాంతో మూడు నెలల క్రితమే పత్రికల్లో నేను ఓ పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చాను. ఆర్థికపరమైన, ఏ ఇతర అంశాల్లోనూ రమ్యతో నాకు కానీ, నా బంధువులకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆ నోటీస్లో పేర్కొన్నాను. గత రెండు మూడు రోజులుగా పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. దాంతో పోలీసుల నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి. ఈ వ్యవహారం గురించి నాకు తెలియదని, కాకపోతే ఈ విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తానని పోలీసులకు చెప్పాను. కాబట్టి మరోసారి చెబుతున్నా.. నాకూ, నా కుటుంబానికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫైనాన్స్ విషయాల్లో మా కుటుంబం ఎప్పుడూ భాగం కాలేదు. ఎందుకంటే మా కుటుంబానికి ఇవ్వడం మాత్రమే తెలుసు. తీసుకోవడం తెలీదు. ఎవర్నీ బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు’’ అని నరేశ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..