Cinema News: ప్రపంచ రికార్డే లక్ష్యంగా..

ఈశ్వర్‌, సాయి విక్రాంత్‌, రిషి, సూర్య కథా    నాయకులుగా నటిస్తున్న చిత్రం ‘నీకు.. నాకు.. రాసుంటే’. కె.ఎస్‌.వర్మ దర్శకుడు. స్రవంతి   పలగాని, అభిషేక్‌ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాట రికార్డింగ్‌, బ్యానర్‌

Updated : 17 Apr 2022 08:24 IST

ఈశ్వర్‌, సాయి విక్రాంత్‌, రిషి, సూర్య కథా    నాయకులుగా నటిస్తున్న చిత్రం ‘నీకు.. నాకు.. రాసుంటే’. కె.ఎస్‌.వర్మ దర్శకుడు. స్రవంతి   పలగాని, అభిషేక్‌ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాట రికార్డింగ్‌, బ్యానర్‌  ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్‌లో  జరిగింది. ఈ సందర్భంగా గాయని సునీత మాట్లాడుతూ.. ‘‘నేను లైవ్‌లో ఓ సినిమాకి  పాట పాడటం ఇదే తొలిసారి. ఇదీ ఓ రికార్డ్‌ అనుకుంటా’’ అన్నారు. ‘‘ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్‌ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని   లైవ్‌ రికార్డు చేస్తాం. తప్పకుండా మా కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ నటి కీలక పాత్రలో నటించనున్నారు’’ అన్నారు దర్శకుడు కె.ఎస్‌.వర్మ. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని