Rajamouli: ఎన్టీఆర్‌, మహేశ్‌ మూవీలు ఇది గమనించారా?

కొన్ని సార్లు అనుకోకుండా అలా కుదిరిపోతాయంతే. తరచి చూస్తే ‘అరె భలే జరిగిందే’ అని అందరూ అనుకుంటారు.

Published : 25 Apr 2022 06:01 IST

హైదరాబాద్‌: కొన్ని సార్లు అనుకోకుండా అలా కుదిరిపోతాయంతే. తరచి చూస్తే ‘అరె భలే జరిగిందే’ అని అందరూ అనుకుంటారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు హీరోల సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఆయనకిది 29వ చిత్రం. ఇక త్వరలోనే మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కాగా, మహేశ్‌బాబుకి ఇది 29వ సినిమా కావడం విశేషం. ఇలా ఒకేసారి అటు ఎన్టీఆర్‌, ఇటు మహేశ్‌ల 29వ సినిమాకు రాజమౌళినే దర్శకుడు కావడం విశేషం. అంతే కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతాయి. గత రాత్రి ‘ఆచార్య’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన రాజమౌళి విహారయాత్ర కోసం దుబాయి వెళ్లారు. అలాగే మహేశ్‌ కూడా కుటుంబంతో కలిసి దుబాయ్‌ బయలుదేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని