Paruchuri Gopala Krishna: మహేశ్‌ని ఎప్పుడూ అలా చూడలేదు: పరుచూరి

కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవికి నివాళులర్పించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. సూపర్‌స్టార్‌ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 

Published : 12 Oct 2022 16:33 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవికి (Indira Devi) నివాళులర్పించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. సూపర్‌స్టార్‌ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇలాంటి సమయంలో ఘట్టమనేని కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని  కోరుకున్నారు.

‘‘ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో ఏళ్ల నుంచి మాకు మంచి అనుబంధం ఉంది. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో మహాలక్ష్మి. ఆమె ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె కాలం చేసిందని తెలిసి బాధపడ్డా. ఆమె సంస్మరణ సభలో కృష్ణగారిని కలిశా. గుండె నిబ్బరంతో కూర్చొన్నారు. ఆయన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. చిరునవ్వుతో కనిపించే మహేశ్‌బాబుని అంత దిగులుగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఇందిరా దేవి(70) సెప్టెంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని