‘ఆయన హాలీవుడ్లో ఉంటే ఎన్నో అవార్డులు వచ్చేవి’
పి.ఎల్.నారాయణ.. మనకు మన సినీ ఇండస్ట్రీకి దొరికిన ఒక అద్భుతమైన నటుడు అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆయన హాలీవుడ్లో ఉండి ఉంటే ఎన్నో అవార్డులు వచ్చేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పరుచూరి పలుకులు’లో భాగంగా దిగ్గజ నటుడు పి.ఎల్.నారాయణ గురించి మాట్లాడారు.
నటుడు పి.ఎల్.నారాయణ గురించి పరుచూరి
ఇంటర్నెట్ డెస్క్: పి.ఎల్.నారాయణ.. మన సినీ ఇండస్ట్రీకి దొరికిన ఒక అద్భుతమైన నటుడు అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆయన హాలీవుడ్లో ఉండి ఉంటే ఎన్నో అవార్డులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పలుకులు’లో భాగంగా దిగ్గజ నటుడు పి.ఎల్.నారాయణ గురించి తాజాగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చదివేయండి..
‘‘పి.ఎల్.నారాయణ ఒక నటుడు.. ఒక దర్శకుడు.. రచయిత కూడా. ‘ఖైదీ’ దగ్గర్నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ‘కలియుగ మహాభారతం’లో శకుని పాత్రలో అద్భుతంగా నటించారు. గుమ్మడి, ఎస్వీ రంగారావు, రావుగోపాల రావు, కైకాల సత్యనారాయణ.. అలాగే పి.ఎల్.నారాయణ, సుత్తివేలు, నూతన ప్రసాద్.. ఇలా అద్భుతమైన పాత్రలు ధరించే మహానటులు మనకు ఉన్నారు. ఇంకొంచెం పర్సనాలిటీ ఉండుంటే మీరు ఎస్వీరంగా రావు అంతటి వాడివయ్యేవాడివని పి.ఎల్.ఎన్తో చెప్తూ ఉండేవాడిని. వీలైతే ఆ సినిమా మీరు కూడా చూడండి. ఒకవేళ పి.ఎల్.నారాయణ హాలీవుడ్లో పుట్టి ఉంటే ఆయన నటనకు ఎన్నో అవార్డులు వచ్చి ఉండేవి. సజహనటి.. సహజ నటుడు అంటుంటాం కదా.. నారాయణ మాత్రం అతి సహజ నటుడు’’ అని పరుచూరి అన్నారు.
‘‘పి.ఎల్.ఎన్తో నీకు ‘నట గ్రామీణ’ అనే బిరుదు ఇస్తా అని అంటూ ఉండేవాడిని. అతను పంచె కట్టుకొని ప్రజల్లోకి వస్తే నటుడు అని ఎవరూ అనుకోరు. ఎవరో పేద రైతో.. శ్రామికుడో అనే అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఏర్పరిచిన మహానటుడు పి.ఎల్.ఎన్. ‘ఖైదీ’లో చిరంజీవికి తండ్రి పాత్రలో ఆయన కనిపించారు. రావుగోపాల్తో కలిసి చేసే ఒకే ఒక సన్నివేశం నారాయణ నటన ఆకాశంలో మెరుపులా మెరిసింది. ఏదేమైనా అమ్మపాలు తాగిన వారు (రంగస్థలం) నుంచి వచ్చిన వారు అద్భుతమైన నటులే అవుతారు. అందులో ఒకరు పి.ఎల్.నారాయణ. 1985 అనుకుంటా.. పేదోళ్ల గురించి ఒక డైలాగ్ రాయమని అడిగారు. ‘పేదోడికి నోరు ఉంటది.. ఆకలి వేస్తే అమ్మా అంటది. కోపమొస్తే నీయమ్మా అంటది’ అని డైలాగ్ రాశాను. ఆ డైలాగ్ పి.ఎల్.ఎన్ చెప్పగానే థియేటర్ ఎలా ఊగిపోయిందో.. దానికి నేనే సాక్ష్యం. వెంటనే పి.ఎల్.ఎన్ వచ్చి నన్ను కౌగలించుకున్నాడు. ఆ డైలాగ్ తర్వాత ఆయనలో ప్రతి పేదవాడు తనను తాను చూసుకున్నాడు. ఆ తర్వాత ఏ ఊరికి వెళ్లినా నన్ను ఆ డైలాగ్ చెప్పమని అడుగుతూ ఉండేవారు’’.
‘‘‘ఘరానా మొగుడు’ సినిమాలో ఒక డైలాగ్ రాశాను. అయితే.. రాఘవేంద్రరావుగారు వద్దన్నారు. వెంటనే నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పగాను..‘డైలాగ్ చాలా బాగుంది కదా.. నేను చెప్తా ఉండండి’ అని వెళ్లి రాఘవేంద్రరావుకి చెప్పారు. అయినా రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు. నేను మాత్రం చేయను కావాలంటే.. మీరే డైరెక్ట్ చేసుకోండి అని వెళ్లి పక్కన కూర్చున్నారు. అలా ఆ షాట్ను చిరంజీవి గారు డైరెక్ట్ చేశారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే అలా నడుచుకుంటూ వస్తున్న నగ్మను ఉద్దేశిస్తూ.. పి.ఎల్.ఎన్ ఒక డైలాగ్ చెప్తారు.. ‘అమ్మా.. పేదోడు ఎక్కాడని కారు తగలెట్టారు. ఇప్పుడు పేదోడు ముట్టుకున్నాడని ఒళ్లు తగలెట్టుకునేరు’ అంటాడు. ‘ఘరానా మొగుడు’ చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఆ డైలాగ్ రియాక్షన్ గుర్తుంటుంది. ఈ విషయంలో రాఘవేంద్రరావుగారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నవ్వుతూ ఆ పక్కన కూర్చొని చిరంజీవి గారితో డైరెక్ట్ చేయించారు. ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రంలో పి.ఎల్.ఎన్ గాంధీ వేషంలో పండించిన నటన గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. టి.కృష్ణ తీసిన ప్రతి సినిమాలోనూ ఆయన ఉండేవారు. ఆర్.నారాయణమూర్తి సినిమాలన్నింటికీ ఆయన రచయితగా పనిచేశారు. ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నా.. ఆయన కుటుంబం మాత్రం బాగుండాలని కోరుకుంటున్నా. ఆయన కేవలం తన శరీరాన్ని మాత్రమే కాదు.. నటనను విడిచి వెళ్లారని నేను భావిస్తా’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్