Poonam Kaur: ఎంతో ఇబ్బందిపెట్టారు.. ఇప్పటికైనా ప్రశాంతంగా బతకనివ్వండి: పూనమ్‌ కౌర్‌

‘ఇంతకాలం నన్ను ఎంతో ఇబ్బందిపెట్టారు. కాబట్టి ఇకనైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని అంటున్నారు నటి పూనమ్‌ కౌర్‌. నటిగా ప్రేక్షకుల్ని అలరించి...

Published : 06 May 2022 02:03 IST

హైదరాబాద్‌: ‘ఇంతకాలం నన్ను ఎంతో ఇబ్బందిపెట్టారు. కాబట్టి ఇకనైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని అంటున్నారు నటి పూనమ్‌ కౌర్‌. నటిగా ప్రేక్షకుల్ని అలరించిన ఆమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న పూనమ్‌ ఇటీవల ఓ ఇద్దరు చిన్నారులతో కలిసి ఫొటోలు దిగి సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు.. ‘ఆ పిల్లలు ఎవరు మేడమ్‌?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా మరికొంత మంది మాత్రం పూనమ్‌కు పెళ్లైందని.. వాళ్లిద్దరూ ఆమె పిల్లలేనని కామెంట్లు చేశారు. దీనికి సంబంధించి పలు పత్రికల్లో వార్తలూ దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న వార్తలపై పూనమ్‌ స్పందించారు. ట్విటర్‌ వేదికగా ఆయా వెబ్‌సైట్లు ప్రచురించిన వార్తలు షేర్‌ చేసిన పూనమ్‌.. ‘‘నన్ను ఇంతకాలం ఇబ్బందిపెట్టింది, నా పరువు మర్యాదలకు భంగం కలిగించింది చాలు. నేను షేర్‌ చేసిన ఫొటోలో ఉన్న చిన్నారులు నాకెంతో ఇష్టమైన స్నేహితుల పిల్లలు. థ్యాంక్యూ సోషల్‌మీడియా. ఇకపై నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి’’ అని పూనమ్‌ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని