Dil Raju: నా 25ఏళ్ల సినీ కెరీర్లో ‘శాకుంతలం’ పెద్ద జర్క్.. ఆ షోతో విషయం అర్థమైంది: దిల్రాజు
Dil raju: సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం మార్నింగ్ షో పడగానే విషయం తనకు అర్థమైపోయిందని సినీ నిర్మాత దిల్రాజు అన్నారు.
ఇంటర్నెట్డెస్క్: సమంత (Samantha) కీలక పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ (Shaakuntalam) తన 25ఏళ్ల సినీ నిర్మాణ కెరీర్లో పెద్ద జర్క్ అని ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు (Dil raju) అన్నారు. గుణశేఖర్తో కలిసి ఆయన ‘శాకుంతలం’ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్రాజు అనేక విషయాలను పంచుకున్నారు.
‘నా 25 సంవత్సరాల కెరీర్లో ‘శాకుంతలం’ పెద్ద జర్క్ ఇచ్చింది. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును స్వాగితిస్తా. సినిమాను నేను నమ్మాను. ప్రేక్షకులకు నచ్చితే ఆదరిస్తారు. ఒకవేళ నచ్చలేదంటే నా జడ్జిమెంట్ తప్పని అర్థం. ఆ పొరపాటు ఎలా జరిగిందో ఒకసారి చెక్ చేసుకోవడమే. ‘శాకుంతలం’లో నా జడ్జిమెంట్ తప్పయింది. ఇంత సుదీర్ఘ కెరీర్లో 50కు పైగా సినిమాలను నిర్మిస్తే, ఫ్లాప్ అయినవి నాలుగైదు మాత్రమే ఉంటాయి. ‘శతమానంభవతి’ సమయంలో యూఎస్లో ఒకరోజు ముందుగానే వేశాం. అందరికీ నచ్చింది. ‘శాకుంతలం’ నాలుగు రోజులు ముందు షో వేశాం. మిశ్రమ స్పందన వచ్చింది. శుక్రవారం మార్నింగ్ షో అయిపోగానే పరిస్థితి అర్థమైంది. మొదటి రోజు ఆడియెన్స్తో కలిసి సినిమా చూస్తే, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా ఆడుతుందో లేదో తెలుస్తుంది. కొన్నిసార్లు డివైడ్ టాక్ రావచ్చు. కొంతమందికి నచ్చి, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఎక్కువ మంది నచ్చలేదంటేనే అది ఫ్లాప్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా ఫోన్లు రావడం లేదంటే అర్థం చేసుకుంటా. శుక్రవారం అయిపోతే ఆ సినిమా గురించి వదిలేస్తా. శనివారం నుంచి కొత్త సినిమాలపై దృష్టి పెడతా. తర్వాతి ప్రాజెక్టులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటా’’అని చెప్పుకొచ్చారు.
తమిళ రీమేక్ ‘96’ విషయంలోనూ తన అంచనా తప్పయిందని దిల్రాజు చెప్పుకొచ్చారు. ‘‘ఆ సినిమా అల్లు అర్జున్, నాని సహా పలువురికి చూపిస్తే బాగుందని చెప్పారు. అయితే, కరోనా కారణంగా ఆ సినిమాను ఓటీటీలో ఎక్కువ మంది చూసేశారు. ఆ తర్వాత ‘జాను’ విడుదలైంది. ‘96’ చూసిన ఫీల్ను ఈ సినిమాతో ఆస్వాదించలేకపోయారు. ‘జాను’, ‘జెర్సీ’ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఏ సినిమాను రీమేక్ చేయకూడదు. ఈ రెండు సినిమాల గురించి అప్పటికి నిర్ణయం తీసుకోవడంతో వెనక్కి వెళ్లలేకపోయాం. ప్రస్తుతం రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాం. దీని తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్లతో సినిమా ఉంటుంది. అయితే, వాళ్ల ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మా సంస్థలో సినిమా ఉంటుంది’’ అని దిల్రాజు(Dil raju) అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..