#SSMB28: మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబో.. మరో అప్‌డేట్‌ ఆ రోజే!

#SSMB28 తదుపరి అప్‌డేట్‌ కోసం వేచి చూడాల్సిందేనని మహేశ్‌బాబు అభిమానులకు నిర్మాత నాగవంశీ విజ్ఞప్తి చేశారు. ట్విటర్‌ వేదికగా ఆయన ఏమన్నారంటే?

Published : 28 Mar 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)- దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు మహేశ్‌ లుక్‌తో కూడిన ఓ పోస్టర్‌ను పంచుకుంది. అందులో మహేశ్‌ సిగరెట్‌ కాలుస్తూ.. స్టైల్‌గా నడుస్తూ కనిపించారు. ఆయన వెనుక లారీ, పక్కన కారు, చుట్టూ మిర్చితో పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ అప్‌డేట్‌ ఆనందంలో ఉన్న మహేశ్‌ ఫ్యాన్స్‌కు.. మరో అప్‌డేట్‌ ఎప్పుడుంటుందో చెబుతూ అప్పటి వరకూ ఓపికతో ఉండాలని నిర్మాత నాగవంశీ విజ్ఞప్తి చేశారు.

‘‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ అప్‌డేట్‌తో మీరంతా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. తదుపరి హైపర్‌ మాసీ అప్‌డేట్‌.. కృష్ణగారి జయంతి సందర్భంగా మే 31న వస్తుంది. అప్పటివరకూ ఓపికతో ఉంటారని భావిస్తున్నా’’ అని నాగవంశీ ట్వీట్‌ చేశారు. ‘ఫస్ట్‌లుక్‌ అదిరింది. నెక్ట్స్‌ అప్‌డేట్‌ ఇంకా బాగుండేలా చూడండి’, ‘శ్రీరామనవమికి ఏం లేదని హింట్‌ ఇచ్చారు అంతేగా’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారుకాని ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజాహెగ్డే, శ్రీలీల సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని