Puri Musings: జీవితాలు నాశనం చేసుకోకండి.. యూత్కు పూరీ జగన్నాథ్ విన్నపం
‘పూరీ మ్యూజింగ్స్’(Puri Musings) పేరుతో ఎన్నో విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh). ఈసారి ఆయన యూత్ను ఉద్దేశించి మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుందని. దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని పూరీజగన్నాథ్(Puri Jagannadh) అన్నారు. యూత్ ఆలోచనలను పక్కదోవ పట్టించేవాళ్లు చాలా మంది ఉంటారని.. వారితో అప్రమత్తంగా ఉండాలని పూరీ హితవు పలికారు. పూరీ మ్యూజింగ్స్(Puri Musings)లో ఈసారి యూత్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
‘‘యూత్.. వయసులో ఉన్న యువతరం మీరు. ఈ వయసులో మీ రక్తం ఎగసిపడుతుంటుంది. మీ మజిల్స్..విజిల్స్ వేస్తుంటాయి. కాళ్లల్లో విపరీతమైన బలం ఉంటుంది. ఒకచోట కూర్చోవాలనిపించదు. నిద్ర రాదు. ఎప్పుడూ హైపర్గా ఉంటారు. ఏది వద్దంటే.. అదే చేస్తారు. ఎప్పుడు ఏ పని చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. భయం తెలీదు. భవిష్యత్తు గురించి బాధ ఉండదు. మీ వయసులో ఉన్న యువతరమే మేథావులకు కావలసింది. కానీ, చాలా మంది యూత్ను తప్పుదోవ పట్టిస్తారు. మిమ్మల్ని నమ్మిస్తారు, ఉద్వేగపరుస్తారు. మీతో ధర్నాలు, ఉద్యమాలు చేయిస్తారు. ఎందుకంటే ప్రతిదానికి యూత్ కావాలి. గుడిలో భజన చేసేది మీరే, పండగలకు డాన్స్ చేసేది మీరే. సినిమా టికెట్స్ కోసం చొక్కలు చించుకునేది మీరే.. యుద్ధంలో ముందుండే సైనికులు మీరే. ఆఖరికి సూసైడ్ బాంబర్స్ కూడా మీరే. ఈ వయసులో మీకు కావాల్సింది మీలో స్ఫూర్తినింపే వాళ్లు. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో మీకే తెలీదు. యూత్కోసం చాలా మంది మేథావులు మాట్లాడతారు. అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి. అయితే, స్ఫూర్తినింపడం వేరు, రెచ్చగొట్టడం వేరు. తేడా తెలుసుకోకపోతే మీరు చాలా తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఉసిగొలుపుతుంటారు. దయచేసి జీవితాలు నాశనం చేసుకోకండి. మీ అమ్మ నాన్నలు మీ గురించి ఎన్నో కలలు కంటారు. వాటిని వదిలేసి ఇంకెవరో కల కోసం బలి కావద్దు. మీరు జేజేలు, నినాదాలు చేస్తుంటే అవి ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. చొక్క చించుకున్నప్పుడు.. అది మీ నాన్న కష్టార్జితం అని గుర్తుపెట్టుకోండి. చెయ్యి కోసుకున్నప్పుడు.. మీ అమ్మకు తెలిస్తే ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి. యుక్త వయసులో భగత్సింగ్లా దేశం కోసం చేస్తే ఓకే. కానీ, ఇంకెవరి కోసమో అనవసరంగా చేస్తే మీ అంత మూర్ఖులు మరొకరు ఉండరు. గుర్తుపెట్టుకోండి.. మంచి నాయకులు ఉంటారు, చెడ్డ వాళ్లు కూడా ఉంటారు. మీలో స్ఫూర్తినింపే వాళ్లు ధైర్యం చెప్పి భుజం తడతారు. రెచ్చగొట్టే వాళ్లు లేనిపోనివి చెప్పి ఉసిగొల్పుతారు. జాగ్రత్తగా ఉండండి’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!