Pushpa The Rule: పుష్పరాజ్ చిటికెన వేలు గోరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? కారణం అదేనా?
Pushpa The Rule: అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ సినిమా రిలీజ్ డేట్ను తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో విడుదల చేసిన పోస్టర్పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.
హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘పుష్ప: ది రూల్’ (Pushpa The Rule). 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్గా దీన్ని తీసుకొస్తున్నారు. తొలి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘పుష్ప2’ ఆ అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప2’ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పంచుకున్న పోస్టర్లో అల్లు అర్జున్ చేతిని చూపిస్తూ, అందులో చిటికెన వేలు గోరును హైలైట్ చేసింది చిత్ర బృందం. కొన్ని రోజుల కిందట ‘వేర్ ఈజ్ పుష్ప’ పేరుతో విడుదల చేసిన వీడియోలోనూ అదే గోరును హైలైట్ చేశారు. అయితే అప్పట్లో దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపైనే చర్చ జరుగుతోంది.
ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ చేశారు!
ఇలా కేవలం చిటికెన వేలు గోరును ప్రత్యేకంగా చూపించడం వెనుక ఓ థియరీ ఉందని చెబుతున్నారు. అదేంటంటే, కొన్ని సంస్కృతుల్లో తమ సంపదను, సమాజంలో స్థాయిని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారట. అంతేకాదు, కేవలం రూల్ చేయడానికి మాత్రమే తాము ఉన్నట్లు గుర్తుగా చూపించడానికి కూడా పెంచుతారని అంటున్నారు. ఇక ఎర్ర చందనం వ్యాపారాన్ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయడగలడని సూచనగా దాన్ని హైలైట్ చేస్తున్నట్టు టాక్. సుకుమార్ తీసే ప్రతి షాట్ విషయంలోనూ కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి. అవేంటో స్వయంగా ఆయనే చెబితేనే తెలుస్తుంది. గతంలో ‘రంగస్థలం’లో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్గా తీసుకున్నారు. పామును ఏ విధంగానైతే కొట్టి చంపుతారో అలాగే ఫణీంద్రభూపతి (జగపతిబాబు)ని కూడా చిట్టిబాబు (రామ్చరణ్) కొట్టి చంపుతాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గోరును హైలైట్ చేయడం వెనుక ఏముందో చూడాలి.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప2’ కోసం మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరోవైపు దేవిశ్రీకి కూడా జాతీయ అవార్డు రావడంతో ‘పుష్ప1’ను మించేలా పాటలను స్వరపరుస్తున్నట్లు టాక్. రష్మిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్. -
‘కన్నప్ప’లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్ట్ పెట్టింది. -
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్2: శౌర్యంగపర్వం’లో మరో మలయాళ నటుడు వచ్చి చేరారు. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్ మూవీ సాంగ్పై నిర్మాత ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య