RRR: రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌.. మిమ్మల్ని చూస్తే అసూయ కలుగుతోంది: ఆర్‌. మాధవన్‌

రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో ‘నాటు నాటు’ పాట గతేడాది నవంబర్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వేసిన కొన్ని స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పులకు

Published : 05 Jan 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో ‘నాటు నాటు’ పాట గతేడాది నవంబర్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి వేసిన కొన్ని స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పులకు ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ కూడా ఫిదా అయ్యారు. ఆ పాటలోని స్టెప్పులను ఎడిట్‌ చేసిన వీడియోను తాజాగా ట్విటర్‌లో పోస్టు చేసి.. వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించారు. 

‘‘ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం.. సమన్వయం నాలో ఈర్ష్య పుట్టేలా చేస్తున్నాయి. నాకు అసూయ కలుగుతోంది. అయినా, మీరిద్దరి పట్ల గర్వంగా ఉంది. హ్యాట్సాఫ్‌’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. మ్యాడీ ట్వీట్‌కు స్పందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం.. ‘థ్యాంక్యూ మ్యాడీ సర్‌’ అంటూ సమాధానం ఇచ్చింది. 

తన ట్వీట్‌కు స్పందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంను ఉద్దేశిస్తూ మ్యాడీ ‘భారత్‌లో బాక్సాఫీస్‌ కలెక్షన్లను మీరు తిరిగి రాయబోతున్నారు’’అంటూ మరో ట్వీట్‌ చేశారు. వెంటనే ‘‘మేము సిద్ధంగా ఉన్నాం. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం సర్! దేశంలోని థియేటర్ సమస్యలను అతి త్వరలో అధిగమిస్తామని ఆశిస్తున్నాము!’’అంటూ మ్యాడీ ట్వీట్‌కు స్పందించింది చిత్రబృందం.

రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 7న ఈ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం.. థియేటర్ల మూసివేత తదితర కారణాలతో విడుదల వాయిదా పడింది. తదుపరి విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. మరి వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని