Covid Relief Fund: రజనీ కుమార్తె భారీ విరాళం

కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సాయం చేసేందుకు సినీ సెలబ్రిటీలు నడుం బిగించారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తమ వంతు....

Published : 14 May 2021 19:26 IST

చెన్నై: కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తమ వంతు సాయాన్ని  అందించగా.. తాజాగా ఆ జాబితాలోకి నటుడు అజిత్‌, రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ని సౌందర్య కలిశారు. తన భర్త విశాగన్‌ తరఫున రూ.కోటిని ఆర్థికసాయంగా అందజేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అజిత్‌ రూ.25 లక్షలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, దర్శకుడు మురుగదాస్‌ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని