Rakul: క్లిక్స్ కోసం ఏదైనా రాసేస్తారా

క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్‌లైనా పెట్టేస్తారా?అని అగ్రకథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్‌ ప్రశ్నించారు. ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి వచ్చిన కథనం పట్ల ఆమె ఆగ్రహం....

Published : 21 Jun 2021 10:39 IST

ఆంగ్ల పత్రికా కథనంపై రకుల్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్‌లైనా పెట్టేస్తారా?అని అగ్రకథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్‌ ప్రశ్నించారు. ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి వచ్చిన కథనం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా సినిమాకీ మధ్య నా డేట్స్‌ సర్దుబాటు చేయడంలో దయచేసి సాయం చేయండంటూ కౌంటర్‌ వేశారు. దక్షిణాదిలో అగ్రకథానాయికగా బాసిల్లుతున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఆమె చేతిలో సుమారు అరడజను బీటౌన్‌ చిత్రాలున్నాయి. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడం చేత షూటింగ్స్‌ అన్ని ఒక్కసారిగా పట్టాలెక్కుతున్నాయి. దాంతో వరుస షూటింగ్స్‌లో ఫుల్‌ బిజీగా ఉంటున్నాను. కొన్నిసార్లు డేట్స్‌ కూడా సర్దుబాటు కావడం లేదు. డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతోనే తెలుగు ప్రాజెక్ట్‌లకు నో చెప్పాల్సి వస్తుంది’ అని రకుల్‌ తెలిపారు.

కాగా, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని ఆదివారం ఓ ఆంగ్ల పత్రికలో.. తెలుగు చిత్రాల్లో తనకు అవకాశాలు కరవయ్యాయి అని రకుల్‌ చెప్పినట్లు వార్త రాసుకొచ్చారు. అది చివరికి రకుల్‌ కంట పడింది. దాంతో ఆమె ఆగ్రహానికిలోనై.. ‘నాకు అర్థం కాని విషయం ఏమిటంటే.. వీళ్లు హెడ్డింగ్‌లో పెట్టినట్లు.. టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని ఎప్పుడు చెప్పాను. ఒక ఏడాది అనగా 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాలు కాకుండా కొత్త ఆఫర్స్‌ కోసం దయచేసి నా డేట్స్‌ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఆ విషయంలో మా టీమ్‌కి సాయం చేయండి’ అని ఆమె రాసుకొచ్చారు. రకుల్‌ ట్వీట్‌పై స్పందించిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌.. ‘నాకు తెలుసు రకుల్‌.. షూటింగ్స్‌తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. ఇటీవల నా స్నేహితుడు రాసిన స్క్రిప్ట్‌ నీకు బాగా నచ్చినప్పటికీ.. నీ డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. నువ్వు ఇలాగే రాక్‌ చెయ్‌ రకుల్‌. నీ సినిమాలతో అందరికీ సమాధానం చెప్పు’ అని స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని