Samantha: చైతో విడాకులపై మళ్లీ మళ్లీ మాట్లాడాలని లేదు!

నాగచైతన్యతో విడాకుల తీసుకోవడంపై మళ్లీ మళ్లీ మాట్లాడటం తనకి ఇష్టం లేదని అగ్రకథానాయిక సమంత తెలిపారు. ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్‌.. మొదటిసారి తన విడాకుల వ్యవహారంపై...

Updated : 16 Dec 2021 16:27 IST

హైదరాబాద్‌: నాగచైతన్యతో విడాకుల అంశంపై మళ్లీ మళ్లీ మాట్లాడటం తనకి ఇష్టం లేదని నటి సమంత తెలిపారు. ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్‌.. మొదటిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే. విడిపోయిన సమయంలో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, చనిపోవాలనుకున్నానని ఆమె అన్నారు. 2021.. తనకి వ్యక్తిగతంగా కలిసి రాలేదని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

తమ విడాకుల అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిసూ.. ‘‘మేమిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆ మొత్తం వ్యవహారంపై నా అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పేశాను. కాబట్టి, ఇప్పుడు మళ్లీ మళ్లీ ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను’’ అని సమంత పేర్కొన్నారు.

‘ఏమాయ చేసావే’ చిత్రంతో పరిచయమైన సామ్‌-చై కొన్ని సంవత్సరాల తమ ప్రేమ అనంతరం 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు, ప్రస్తుతం సామ్‌ వరుస సినిమాలు ఓకే చేస్తున్నారు. ‘యశోద’, ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లకు పచ్చజెండా ఊపిన ఆమె, బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు ఓకే చేసినట్లు సమాచారం. ‘పుష్ప’లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో సామ్‌ మెరవనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని