sampath nandi: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సంపత్‌నంది

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ సంపత్‌నంది

Published : 09 Sep 2021 16:42 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ దర్శకుడు సంపత్‌ నంది గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ‘సీటీమార్‌’లో నటించిన అమ్మాయిలతో కలిసి హైదరాబాద్‌లో ఆయన మొక్కలు నాటారు. ఆ చిత్రాలను ట్విటర్‌ ద్వారా పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సినీతారలు, రాజకీయ ప్రముఖులు భాగస్వాములవుతున్న విషయం తెలిసిందే. ఇంతటి మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ట్విటర్‌లో తెలిపిన సంపత్‌నంది, లక్షల మందిని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యులను చేస్తున్నందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్‌’ సెప్టెంబర్‌ 10 నుంచి థియేటర్లలో కూతకు దిగనుంది. తమన్నా, గోపీచంద్‌లు  ఇందులో కోచ్‌లుగా నటించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని