Sandeep Reddy Vanga: నా మాటలకు ఆ నటి బాధపడింది: సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ (Animal)లో హీరోయిన్ పాత్రకు తన తొలి ఛాయిస్ రష్మిక (Rashmika) కాదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెలిపారు.
ఇంటర్నెట్డెస్క్: ‘కబీర్సింగ్’ (Kabir Singh)తో కియారా అడ్వాణీ (Kiara Advani), ‘యానిమల్’ (Animal)తో రష్మికకు (Rashmika) విజయాన్ని అందించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అయితే, ఈ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు తన మొదటి ఛాయిస్ మాత్రం బాలీవుడ్ నటి పరిణీతి చోప్రానే అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆమెతో కలిసి వర్క్ చేయడం వీలు పడలేదన్నారు. ముఖ్యంగా ‘యానిమల్’ విషయంలో ఆమెకు ‘సారీ’ చెప్పానని తెలిపారు.
‘‘పరిణీతి చోప్రా నటన అంటే నాకెంతో ఇష్టం. నా చిత్రాల్లో ఆమెను హీరోయిన్గా ఎంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘కబీర్సింగ్’లో ప్రీతి పాత్రకు ఆమెనే తీసుకోవాలని తొలుత భావించా. కాకపోతే, కొన్ని కారణాల వల్ల మా కాంబో కార్యరూపం దాల్చలేదు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. ‘యానిమల్’లో హీరోయిన్గా ఆమెను ఎంచుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది. షూట్ మొదలు కావడానికి ఏడాదిన్నర ముందే ఆమె ఈ ప్రాజెక్ట్కు సంతకం చేసింది. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాల పరంగా ఆమెలో గీతాంజలిని (యానిమల్లో హీరోయిన్ పాత్ర పేరు) చూడలేకపోయా. ఇదే విషయాన్ని చెప్పా. ‘‘సారీ. సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ‘యానిమల్’ కోసం మరో నటిని తీసుకోవాలనుకుంటున్నా’’ అని చెప్పా. నా మాటలకు ఆమె ఎంతో బాధపడింది. కాకపోతే, నేను ఎందుకు అలా చెప్పానో అర్థం చేసుకుంది’’ అని సందీప్ తెలిపారు.
Ram Charan: మెగా అభిమానులకు గుడ్న్యూస్.. లీగ్ క్రికెట్లోకి రామ్చరణ్..!
రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. అనిల్కపూర్, బాబీ దేవోల్, త్రిప్తి డిమ్రి కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో గీతాంజలిగా రష్మిక నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి