Tollywood: సీతారామపురంలో.. ఓ ప్రేమకథ

రణధీర్‌, నందిని రెడ్డి జంటగా ఎమ్‌.వినయ్‌బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. చందర్‌ గౌడ్‌ నిర్మాత. సుమన్‌, సూర్య, అమిత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో

Updated : 28 Jan 2022 07:01 IST

రణధీర్‌, నందిని రెడ్డి జంటగా ఎమ్‌.వినయ్‌బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. చందర్‌ గౌడ్‌ నిర్మాత. సుమన్‌, సూర్య, అమిత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. శుక్రవారంతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రేమలో ఉన్న ప్రతి జంట చూడాల్సిన సినిమా. తల్లిదండ్రులకు కూడా మంచి సందేశం ఇస్తున్నాం. సినిమా అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. కొత్త వాళ్లైనా నాయకానాయికలిద్దరూ అనుభవమున్న నటుల్లా చేశారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. పాటలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హీరోగా నా తొలి చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు రణధీర్‌. నిర్మాత మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి..మా అబ్బాయి రణధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రం నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్లుగా ఖర్చు పెట్టాం. కథలో మంచి మలుపులు ఉన్నాయి. ఈ సినిమాని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నందిని, బాషా, ఎస్‌.ఎస్‌.నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని