Adipurush: అతిథిగా ఆధ్యాత్మిక వేత్త.. ఉచితంగా టికెట్లు.. ‘ఆదిపురుష్’ విశేషాలివీ
ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’ ఈ నెల 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..
‘రామాయణం’ (Ramayana) ఆధారంగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush) ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం..
- ప్రముఖ హీరో ప్రభాస్ (Prabhas)కు ఇది 21వ సినిమా. ఆయన నటించిన ఐదో పాన్ ఇండియా చిత్రం. మైథలాజికల్ స్టోరీలో నటించడం, హిందీ దర్శకుడితో కలిసి పనిచేయడం ఆయనకు ఇదే తొలిసారి. జగదానంద కారకుడైన రామ అవతారంలో ఇప్పటి వరకు నటించిన వారంతా మీసం లేకుండా కనిపించారు. ప్రభాస్ మాత్రం ‘ఆదిపురుష్’లో మీసంతో కనిపిస్తారు. రాముడి పాత్ర పోషించేందుకు ప్రభాస్ ముందుగా ఎంతో భయపడ్డారు. ప్రాజెక్ట్ ఓకే అనుకున్నాక మూడు రోజుల తర్వాత దర్శకుడికి ఫోన్ చేసి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ పాత్రలో ఎలా ఒదిగిపోవాలనే విషయంపై చర్చించి, ముందడుగేశారు.
- ఈ సినిమాలో సీత/జానకి పాత్ర పోషించే అవకాశం కృతి సనన్ (Kriti Sanon)కు దక్కింది. ఈ నటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు సినిమా ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసిందీ దిల్లీ భామ. సీత పాత్రలో కృతి నటిస్తుందనే ప్రకటన వెలువడకముందు.. అనుష్కశెట్టి, కియారా అడ్వాణీ, కీర్తిసురేశ్ తదితరుల పేర్లు ప్రచారంలో నిలిచాయి.
- హీరోగా బాలీవుడ్లో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన.. రావణాసురుడు/లంకేశ్ పాత్ర పోషించారు. మరోవైపు, ఎన్టీఆర్ (NTR)- కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ (Devara) సినిమాలోనూ సైఫ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
- లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీసింగ్(Sunny Singh), హనుమంతుడిగా మరో బాలీవుడ్ నటుడు దేవ్దత్తా నాగే (Devdatta Nage) నటించారు.
- ఈ సినిమాతో దర్శకుడు ఓంరౌత్ (Om Raut) పేరు దక్షిణాదిన బాగా వినిపిస్తోంది. రామాయణాన్ని తెరకెక్కించారు కాబట్టి దర్శకుడిగా ఆయనకు ఎంతో అనుభవం ఉందనుకుంటే పొరపాటే. ఈ చిత్రం కంటే ముందు ఆయన హిందీలో రెండే సినిమాలకి (లోక్మాన్య్, తానాజీ) దర్శకత్వం వహించారు. రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండల్లోని ప్రధానమైన కథని ‘ఆదిపురుష్’లో చూపించనున్నారు.
- అత్యున్నత సాంకేతికతతో.. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రచారాన్నీ చిత్ర బృందం భారీ స్థాయిలో చేసింది. అయోధ్యలో టీజర్ని లాంచ్ చేసిన టీమ్.. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇటీవల నిర్వహించింది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ‘‘ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి’’ అని ఆయనే తెలిపారు.
- టికెట్ల విక్రయంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకాన్ని గౌరవిస్తూ.. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, రాముడి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) 10 వేలకిపైగా టికెట్లను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు అందివ్వనున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) సైతం తనవంతుగా 10 వేల టికెట్లను, పేద చిన్నారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలోని రామాలయానికి 100+1 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు శ్రేయస్ మీడియా (Shreyas Media) ప్రకటించింది. తాజాగా బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా 10వేల టికెట్స్ను బుక్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనాథపిల్లల కోసం వీటిని కొన్నట్లు తెలిపింది. ఇన్ని టికెట్లను ఉచితంగా ఇస్తుండడం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే ప్రథమం.
- సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ట్రిబెకా ఫెస్టివల్’ (#Tribeca Festival)లో ప్రదర్శనకు ‘ఆదిపురుష్’ ఎంపికైంది. న్యూయార్క్లో ఇప్పటికే మొదలైన ఆ వేడుకలో ‘ఆదిపురుష్’ను జూన్ 13న ప్రదర్శిస్తారని చిత్ర బృందం ఇటీవల తెలిపింది.
- సెన్సార్ బోర్డు (Central Board of Film Certification).. యు (U) సర్టిఫికెట్ జారీ చేసిన ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. ఇంతటి రన్టైమ్తో తెరకెక్కిన అతి తక్కువ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 500 కోట్లు. 3డీ ఫార్మాట్లో తెలుగు, హిందీలో ఏకకాలంలో రూపొందింది.
- ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకావాల్సి ఉంది. కానీ, టీజర్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఓంరౌత్ అండ్ టీమ్.. వీఎఫ్ఎక్స్పై మరింత వర్క్ చేసింది. దాని కోసమే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చయిందట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్