‘ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు కదమ్మా’ అన్నారు!
తన మధురమైన స్వరంతో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది సినీ ప్రియుల హృదయాల్లో సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొన్న సునీత ఇటీవల రామ్ వీరపనేనితో...
గాయని సునీత
హైదరాబాద్: తన మధురమైన స్వరంతో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. ఆమె ఇటీవల రామ్ వీరపనేనితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వాలంటైన్స్డే సందర్భంగా ఈ జంట ఓ స్పెషల్ చిట్చాట్లో పాల్గొన్నారు. తమ వైవాహిక బంధం, కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
‘‘ఎప్పటి నుంచో రామ్ నాకు తెలుసు. తను ఎప్పుడైనా ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు. వృత్తిపరమైన పనుల విషయమై లాక్డౌన్లో రామ్ ఓసారి నాకు ఫోన్ చేశారు. ‘ఇంకేంటి.. ఇలాగే ఉండిపోతావా? లేక పెళ్లి గురించి ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా?’ అని రామ్ని అడిగాను. దానికి ఆయన ‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాదాపు ఏడేళ్ల నుంచి పరోక్షంగా నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను’ అని సమాధానమిచ్చారు. అనంతరం, అమ్మానాన్న, నా పిల్లల్తో మాట్లాడాను. వాళ్లందరూ ఎంతో సంతోషించారు. అదే సమయంలో రామ్.. నా గురించి వాళ్లింట్లో చెప్పడం.. అక్కడ కూడా ఓకే అనడం జరిగింది’’
‘‘ఇరు కుటుంబాల్లోనూ మా వివాహాన్ని ఓకే అనుకున్నాక.. రామ్ వాళ్ల కుటుంబసభ్యులు మా అమ్మవాళ్లతో మాట్లాడడానికి మొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేసమయంలో నాకు తాంబూలం అందించారు. ఆ ఫొటోలే బయటకు వచ్చాయి. నెట్టింట్లో వైరల్గా మారాయి. ఆ విషయం మా ఇద్దరికీ తెలీదు. అది జరిగిన తర్వాత రోజు నాకు తెలిసిన వాళ్లు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మాకు నిశ్చితార్థమైందని నెట్టింట్లో పోస్టులు దర్శనమిచ్చాయి. ఓసారి పనిపై బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు నాపై కోపంగా ఉన్నారు. ‘నిన్న నీకు ఎంగేజ్మెంట్ అని మాకు ముందే చెప్పొచ్చు కదా. మేము మంచి బట్టలు వేసుకునేవాళ్లం. లైఫ్లో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మాకు చెప్పవా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ప్లాన్ చేయలేదురా. వాళ్లు వచ్చారు.. అనుకోకుండా నాకు బట్టలు పెట్టారు’ అని సమాధానమిచ్చాను. నా పిల్లలు పరిస్థితి అర్థం చేసుకున్నారు. వాళ్లు నాకెంతో సపోర్ట్ చేశారు’’ అని సునీత వివరించారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.