Kangana Ranaut: నేను ‘తలైవి’గా మారడానికి కారణం ఆయనే!
‘తలైవి’ ప్రీ రిలీజ్ ఈవెంట్. కంగనా రనౌత్, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘తలైవి’ చిత్రంలో నేనుండటానికి కారణం రచయిత విజయేంద్ర ప్రసాద్’ అని నటి కంగనా రనౌత్ అన్నారు. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి, జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో పూర్ణ కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘‘తలైవి’లో నేనుండటానికి కారణం రచయిత విజయేంద్రప్రసాద్ గారు. తలైవి పాత్రకి నేను అయితేనే బాగుంటానని చిత్రబృందానికి నా పేరు సూచించారు. ఇంతటి భారీ బడ్జెట్తో నాయికా ప్రాధాన్య చిత్రాన్ని రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. అన్ని సవాళ్లని అధిగమించి ఈ సినిమాని నిర్మించిన విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు. కల్మషం లేని వ్యక్తి. ఇప్పటి వరకు నేను అలాంటి వ్యక్తిని కలవలేదు. ఈ సినిమాకి పనిచేసిన నటులు అరవింద్ స్వామి, భాగ్యశ్రీ, మధుబాల, నాజర్, పూర్ణ, రచయితలు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. సమష్టికృషి వల్లే ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నిర్మాత విష్ణువర్థన్ నన్ను మూడేళ్ల క్రితం కలిశారు. సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడారు. తనకి సినిమా అంటే ఎంత ఇష్టమో అప్పుడే నాకు అర్థమైంది. అందుకే సినిమాల గురించి మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను అడగండి అని చెప్పాను. అలా ఈ ప్రాజెక్టుని నా దగ్గరికి తీసుకొచ్చారు. కథ రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుడు విజయ్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో రీసెర్చ్ చేశాడు. ముందుగా ఈ సినిమాలోని టైటిల్ పాత్ర కోసం మరో నటిని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కంగనా అయితే ఈ పాత్రకి న్యాయం చేయగలదని నా అభిప్రాయం వ్యక్తం చేశా. కంగనా అలా ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. జయలలిత పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా విడుదలయ్యాక నటిగా ఆమె మరోస్థాయికి చేరుకుంటుంది’ అని అన్నారు.
విజయ్ మాట్లాడుతూ.. ‘సినిమాని ప్రేమించే తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా గౌరవం. మా సినిమాని తెలుగులోనూ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. ఎం.జి.ఆర్గా అరవింద్ స్వామి, జయలలితగా కంగనా ఒదిగిపోయారు. నేను 2000 సంవత్సరంలో విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర కథలు రాసేవాడ్ని. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నా. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
అరవింద్ స్వామి మాట్లాడుతూ.. ‘నేను చాలా సినిమాల్లో నటించాను. కానీ, ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామికావడం చాలా ఆనందంగా ఉంది. కంగనాతో కలిసి నటించి, ఓ నటుడిగా ఎంతో నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకుంది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. చాలా బాగుంది. ఘన విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
‘అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ‘తలైవి’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నా. ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉంది’ అని భాగ్యశ్రీ తెలిపారు. ‘నా కెరియర్లో ది బెస్ట్ ప్రాజెక్టు ‘తలైవి’. ఇందులో అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నా. కంగనా రనౌత్తో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి పంచింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీ అందరూ ఆ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని పూర్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, క్రియేటివ్ హెడ్ బృందా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్