Kanabadutaledu: సునీల్తో కలిసి నటించేందుకు భయపడ్డా..!
‘ప్రేక్షకులు కచ్చితంగా తెలుగమ్మాయి అయిన నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నా’ అని తెలిపింది వైశాలి రాజ్. సునీల్, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కనబడుట లేదు’ చిత్రంతో నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ప్రేక్షకులు కచ్చితంగా తెలుగమ్మాయి అయిన నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నా’ అని తెలిపింది వైశాలిరాజ్. సునీల్, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కనబడుట లేదు’ చిత్రంతో నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది. బాలరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడింది వైశాలి. మరి ఆమె చెప్పిన సంగతులేంటో చదివేయండి...
లఘు చిత్రాల నుంచి వెండితెరకి..
నా అసలు పేరు కవిత కోన. సినిమాల్లోకి వచ్చాక వైశాలిరాజ్గా మార్చుకున్నా. నేను తెలుగమ్మాయినే. నా స్వస్థలం విశాఖపట్నం. విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తి చేశాను. కొన్నాళ్లు హైదరాబాద్, చెన్నైలో ఉద్యోగం చేశా. ఓసారి అనుకోకుండా లఘు చిత్రంలో నటించా. ‘కనబడుట లేదు’ చిత్ర దర్శకుడు బాలరాజే ఆ షార్ట్ ఫిల్మ్ చేశారు. అలా నటిగా నా ప్రయాణం ఆయనతోనే ప్రారంభమైంది. ఐదారు లఘు చిత్రాలు, ఓ సీరియల్లో నటించా. ఈ చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్నా.
కథంతా నా చుట్టూనే..
ఇదొక క్రైమ్, సస్పెన్స్ లవ్స్టోరీ. థ్రిల్లర్ అంశాలు మెండుగా ఉంటాయి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడొస్తున్న చిత్రాల్లో ఇది ది బెస్ట్ అని నమ్ముతున్నా. ఈ సినిమాలో సునీల్ ప్రధాన పాత్రధారి. ఆయనతో తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సునీల్తో కలిసి నటించేందుకు మొదట్లో కొంచెం కంగారు పడ్డాను. కానీ, తర్వాత అలవాటైపోయింది. సెట్లో సునీల్ ఎంతో సరదాగా ఉండేవారు. నేనిందులో మధ్యతరగతి అమ్మాయి శశిత అనే పాత్రని పోషించాను. కథ అంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అన్ని ఎమోషన్స్ ఉన్న పాత్ర కావడంతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇటీవల సినిమా చూశాను. నటిగా సంతృప్తి చెందాను. ప్రేక్షకులు ఇచ్చే ఫలితం కోసం వేచి చూస్తున్నా.
అలా దర్శకత్వం వైపు..
లఘు చిత్రాలు, సీరియల్లో నటించడం వల్ల సన్నివేశాలు తెరకెక్కించడంలో కొంత అనుభవం వచ్చింది. కెమెరా ఎక్కడ పెట్టాలి? క్లోజ్ షాట్ ఉంటే నటులు ఎక్కడ ఉండాలి? తదితర అంశాలు నేర్చుకున్నాను. దాంతో నాలో దర్శకత్వ లక్షణాలున్నాయని చాలామంది అన్నారు. నాకూ దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది.
నేపథ్యం ఏదైనా ఓకే కానీ..
ఎలాంటి నేపథ్యంలోనైనా నటించాలనుంది కానీ కథంతా నా చుట్టూనే తిరగాలి. దీపికా పదుకొణె, నయనతార, సమంత అంటే చాలా ఇష్టం. వీరి కథల ఎంపిక చాలా బాగుంటుంది.ఈ విషయంలో వాళ్లని స్ఫూర్తిగా తీసుకుంటా. ప్రస్తుతానికి కొన్ని కథల్ని వింటున్నా. ఈ సినిమా విడుదలయ్యాక నిర్ణయం తీసుకుంటా. ప్రేక్షకులు కచ్చితంగా తెలుగమ్మాయి అయిన నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్