Lavanya Tripati: కామెడీ థ్రిల్లర్‌ కథతో...

‘మత్తు వదలరా’ కలయికలో మరో చిత్రం మొదలైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమాని

Updated : 01 Dec 2021 09:31 IST

‘మత్తు వదలరా’ కలయికలో మరో చిత్రం మొదలైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమాని కామెడీ థ్రిల్లర్‌ కథతో  తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రితేష్‌ రాణా. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పకులు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి  ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి క్లాప్‌నివ్వగా... దర్శకుడు, నిర్మాత గుణ్ణ గంగరాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కొరటాల శివ గౌరవ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు కాలభైరవ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్‌ సారంగం ఛాయాగ్రాహకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని