MAA Elections: దమ్ముంటే నా ఫ్యామిలీపై కామెంట్ చేయండి.. నేనేంటో చూపిస్తా: మంచు విష్ణు
మరి కొన్ని గంటల్లో జరగనున్న సిని‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు నటుడు మంచు విష్ణు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి ప్యానల్పై విమర్శలు గుప్పిస్తున్నారు....
నాగబాబు డైలాగ్ సినిమాల్లో వాడుకుంటా..!
హైదరాబాద్: మరి కొన్ని గంటల్లో జరగనున్న సిని‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు నటుడు మంచు విష్ణు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి ప్యానల్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రకాశ్రాజ్ ప్యానల్కు మద్దతిస్తూ ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విష్ణు కౌంటర్ ఇచ్చారు. తన ఫ్యామిలీపై ఎవరైనా కామెంట్లు చేస్తే జీవితంలో క్షమించనని హెచ్చరించారు. ‘పవన్కల్యాణ్కి కోపం వస్తే వార్ వన్సైడ్ అవుతుంది’ అంటూ నాగబాబు చేసిన ఓ కామెంట్పై విష్ణు సెటైర్ వేశారు. డైలాగ్ చాలా బాగుందని.. తన తదుపరి చిత్రాల్లో వాడుకుంటానని అన్నారు.
‘‘ఈ సారి జరగనున్న ‘మా’ ఎన్నికలు తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి సంబంధించినవి. నాకు ప్రత్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో అతడు తెలుగు వ్యక్తి కాదు. అతడి పేరు పలకడం కూడా నాకిష్టం లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలయ్యాడు. ‘తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని సెట్ చేయడానికే ఇక్కడికి వచ్చా’ అంటూ తన మొదటి మీటింగ్లో అతడు చాలా ఆగ్రహావేశాలతో చెప్పాడు. అంత అవసరం లేదు. ఎందుకంటే మా సమస్యలను మేము చక్కదిద్దుకోగలం. సమస్యలు చక్కదిద్దడానికి ఇక్కడ చాలా మంది పెద్దోళ్లు ఉన్నారు. వాళ్లందరి తరఫు నుంచి అతడికి సమాధానం చెప్పడానికి నేను ఒక్కడిని చాలు. ప్రచారంలో భాగంగా అతడు నా ఫ్యామిలీపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. ఇక్కడివాడు కాదు కాబట్టి అతడికి నా ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు.. అందుకే, క్షమించి వదిలేశాను. కానీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా.. దమ్ముంటే అతడిని నా ఫ్యామిలీపై కామెంట్స్ చేయమనండి.. నేనేంటో చూపిస్తా’ అని విష్ణు సవాల్ విసిరారు.
అనంతరం.. ‘‘పవన్కల్యాణ్ ప్రతిసారీ మీ నాన్న పేరే ఎందుకు ప్రస్తావిస్తారు’ అని అందరూ నన్ను అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ ప్రశ్న పవన్కల్యాణ్నే అడగాలి. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ఈగో ప్రొబ్లమ్స్ లేవు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వకీల్సాబ్’ సినిమా నాకు నచ్చింది. మా నాన్నకు విపరీతంగా నచ్చింది. వెంటనే పవన్కల్యాణ్కు ఫోన్ చేసి .. ‘సినిమా చాలాబాగుంది. ‘వకీల్సాబ్’గా నువ్వు బాగా యాక్ట్ చేశావు’ అని ప్రశంసించారు. దానికి పవన్.. ‘థ్యాంక్యూ అండి. మీ లాంటి పెద్ద నటులు ఫోన్ చేసి మెచ్చుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు. కావాలంటే మీరు పవన్ని అడగండి. ఇటీవల ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి త్వరలోనే మా నాన్న సమాధానం చెబుతారు’
‘మెగా ఫ్యామిలీ హీరోలు నాకు మంచి స్నేహితులు. బన్నీ, చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. చరణ్-మనోజ్-మా అక్క క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లు తరచూ కలుస్తూనే ఉంటారు. నేను అంతగా కలవను. బన్నీ-నేను ఎక్కువగా మెస్సేజ్లు చేసుకుంటాం. శిరీష్ నా తమ్ముడు. తేజ్ అయితే నా చిన్న తమ్ముడు. మెగా హీరోస్తో నాది ఇప్పటి అనుబంధం కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్లందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు’
‘మంచు విష్ణుకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ఎలాంటి నిజం లేదు. మీడియా ముందుకు మాత్రమే వాళ్లు రావడం లేదు. కానీ, వాళ్లకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మరి కొన్ని గంటలపాటు ప్రత్యర్థి ప్యానల్ వాళ్లు నాపై ఎన్ని విమర్శలైనా చేసుకోనివ్వండి. వాళ్లు శ్రుతిమించి నా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తే వాళ్లని జీవితంలో క్షమించను’ అని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్