‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. తొలి భాగం వచ్చే ఏడాది

ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విజువల్‌ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Published : 19 Jul 2021 20:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విజువల్‌ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలిభాగాన్ని 2022లో విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి చిత్ర నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్‌,  మద్రాస్‌ టాకీస్‌. ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేశాయి. పులి బొమ్మ ఉన్న ఆయుధాలు, ‘పీఎస్‌- 1’ అనే లోగోతో ఈ పోస్టర్‌ని రూపొందించారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది. శరవేరంగా షూటింగ్‌ జరుగుతోంది. అన్ని భాషలకు చెందిన అగ్ర తారలు ఇందులో నటిస్తున్నారు. అయితే ఆ నటీనటుల వివరాల్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర బృందం. ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌, జయం రవి, కీర్తి సురేశ్‌, మోహన్‌ బాబు తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సుభాస్కరన్‌ సమర్పణలో మణిరత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌, కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌, కళ: తోట తరణి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని