missing: ‘మిస్సింగ్’.. ఆద్యంతం ఉత్కంఠభరితం
హర్షా నర్రా హీరోగా శ్రీని జోస్యుల తెరకెక్కించిన చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించారు.
హర్షా నర్రా హీరోగా శ్రీని జోస్యుల తెరకెక్కించిన చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించారు. మిషా నారంగ్, నికీషా రంగ్వాలా కథానాయికలు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిక మిషా నారంగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నేను మీనా అనే జర్నలిస్ట్గా కనిపిస్తాను. కనిపించకుండా పోయిన శ్రుతి అనే అమ్మాయి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటాను. ఇందులో ఓ రివైంజ్ డ్రామా ఉంటుంది. మరి హీరో ఎవరిపై ప్రతికారం తీర్చుకున్నాడన్నది తెరపైనే చూడాలి. దర్శకుడు శ్రీని ఈ సినిమాని ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు’’ అంది. ‘‘నేనీ సినిమాలో శ్రుతి పాత్రను పోషించాను. కథ ప్రకారం కనిపించకుండా పోయే పాత్ర నాదే. అసభ్యతకు తావు లేకుండా చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి’’ అంది మరో నాయిక నికీషా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును