Nayanthara: తిరుమలలో నయన్‌, విఘ్నేశ్‌.. ఫొటోలు వైరల్‌

కోలీవుడ్‌ ప్రముఖులు, కాబోయే దంపతులు నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు.

Published : 27 Sep 2021 23:17 IST

తిరుమల: కోలీవుడ్‌ ప్రముఖులు, కాబోయే దంపతులు నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కొందరు అభిమానులు వీరితో సెల్ఫీ తీసుకున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. నయనతార నీలిరంగు డ్రెస్సులో, విఘ్నేశ తెల్ల చొక్కా, పంచెతో కనిపించారు. నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే.

దిల్‌ రాజు, వంశీ పైడిపల్లి..

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వంశీ పైడిపల్లి కుటుంబంతో కలిసి వచ్చారు. తమిళ నటుడు విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని